Kerala New Name: కేరళ ఇకపై కేరళం.. అసెంబ్లీలో తీర్మానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala New Name: కేరళ రాష్ట్ర పేరును ‘కేరళం’గా అధికారికంగా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ బుధవారం కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. బుధవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసెంబ్లీలో కేరళ పేరు మార్పు ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనను అసెంబ్లీలోని ఏ పార్టీ వ్యతిరేకించలేదు. దానికి తోడు సవరణను కూడా ఎవరూ సూచించలేదు. దీంతో కేరళ రాష్ట్ర పేరు మార్పు ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించబడింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ కూడా ఇందుకు మద్దతు తెలపడంతో ఈ బిల్లును కేంద్రానికి పంపనున్నారు.
Read also: Rajinikanth: అర్ధమయ్యిందా రాజా.. వాళ్లకు కౌంటరేనా.. ?
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
పేరు మార్పు ప్రతిపాదనపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ‘భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు నవంబర్ 1, 1956న ఏర్పడ్డాయి. కేరళ పుట్టిన తేదీ కూడా నవంబర్ 1నే. మలయాళం మాట్లాడేవారి కోసం ఐక్య కేరళను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జాతీయ స్వాతంత్ర్య పోరాట కాలం నుండి సంఘం బలంగా అభివృద్ధి చెందుతోంది. కానీ రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో మన రాష్ట్రం పేరు కేరళ అని రాశారని తెలిపారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ‘కేరళం’గా మార్చడానికి చర్యలు తీసుకోవాలని ఈ అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వాన్ని ఏకగ్రీవంగా అభ్యర్థిస్తోంది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న అన్ని భాషల్లో మన భూమికి ‘కేరళం’ అని పేరు పెట్టాలని కూడా సభ ఏకగ్రీవంగా అభ్యర్థిస్తోందని సీఎం పినరయి విజయన్ కేంద్రానికి పంపిన లేఖలో కోరారు. ఇంతకుముందు ఉత్తరప్రదేశ్తో పాటు మధ్యప్రదేశ్లో నగరాలు, ప్రాంతాలు మరియు కూడళ్ల పేర్లు మార్చబడిందని మీకు గుర్తుచేస్తున్నానని తెలిపారు. యూపీలోని యోగి ప్రభుత్వం అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా మార్చగా, ఎంపీ ప్రభుత్వం హోషంగాబాద్ జిల్లా పేరును నర్మదాపురంగా మార్చింది. దీనితో పాటు, యుపి ప్రభుత్వం నవాబ్స్ నగరం, లక్నో పేరును కూడా మార్చవచ్చని వినిపిస్తోందన్నారు. లక్నో పేరును లక్ష్మణ్పూర్ లేదా లఖన్పూర్గా మార్చాలని బీజేపీ ఎంపీ సంగమ్ లాల్ గుప్తా ఇటీవల డిమాండ్ చేశారని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..