Sabarimala pilgrimage: శబరిమల దర్శనానికి ఆన్లైన్ బుకింగ్స్.. నిర్ణయాన్ని సమర్ధించుకున్న పినరయి సర్కార్..
- శబరిమల ఆన్లైన్ బుకింగ్స్పై ప్రతిపక్షాల ఆగ్రహం..
- నిర్ణయాన్ని సమర్ధించుకున్న పినరయి సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabarimala pilgrimage: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని కేరళలోని సీఎం పినరయి విజయన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వతా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీపీఎం ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. శబరిమలలో రాబోయే మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్కి ఆన్లైన్ బుకింగ్స్ అమలు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యాత్రను సజావుగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రభుత్వం సమర్థించుకుంది. ఈ నిర్ణయాన్ని కేరళ దేశస్వామ్ మంత్రి విఎన్ వాసనన్ అసెంబ్లీలో సమర్థించారు.
Read Also: Hyderabad: లంచం తీసుకోకుండా ఇంటికి రాదు.. భార్య లంచగొండితనం బయటపెట్టిన భర్త
Also Read
- Kalita Majhi: బెంగాల్ రాజకీయాల్లో సామాన్య ఆడబిడ్డ సంచలనం .. రాష్ట్ర మంత్రిగా ఇళ్లల్లో పనులు చేసుకునే మహిళ !
- Abhishek Banerjee: రాళ్లు విసురుతున్నారు.. కోడిగుడ్లతో కొడుతున్నారు..మమత మేనల్లుడుపై ఎందుకింత కసి?
- Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
- Annamalai: కొత్త పార్టీ పెడతారా?.. బీజేపీకి గుడ్బై చెప్పనున్నారా? అన్నామలై నిర్ణయంపై ఉత్కంఠ..!
రోజూవారీ యాత్రికుల సంఖ్యను నియంత్రించేందుకు ఆన్లైన్ బుకింగ్స్ అవసరమని, లేకపోతే 80,000 మించి యాత్రికులు దాటవచ్చని, ఇది లాజిస్టిక్ వ్యవస్థలపై ప్రభావం చూపిస్తున్నంది మంత్రి వాసనన్ చెప్పారు. గత సంవత్సరాల మాదిరిగానే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, దర్శనానికి స్పాట్ బుకింగ్స్ అనుమతించాలని ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ కోరారు. అయితే, దీనికి సమాధానంగా.. “గతంలో, స్పాట్ బుకింగ్ను అనుమతించడం వలన అధిక సంఖ్యలో రద్దీ ఏర్పడింది, ఇది సౌకర్యాలు మరియు సన్నాహాలను తీవ్రంగా దెబ్బతీసింది, తీర్థయాత్ర సజావుగా నిర్వహించడానికి ఆటంకం కలిగిస్తుంది” అని వాసవన్ చెప్పారు.
అయితే, కేరళ ప్రతిపక్షాలు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అయ్యప్ప స్వామి భక్తుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఆన్ లైన్ బుకింగ్స్ గురించి తెలియదని, వీరిలో చాలా మంది 41 రోజుల పాటు దీక్షలో ఉంటారని, వారికి ఆన్లైన్ స్లాట్ లభించకపోతే దర్శనం లేకుండానే తిరిగి వెళ్లాల్సి ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వానికి వివరించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ మాట్లాడుతూ.. ఇది పాదయాత్రకు అంతరాయం కలిగించే కుట్రగా ఆరోపించారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు.
తాజావార్తలు
-
Kalita Majhi: బెంగాల్ రాజకీయాల్లో సామాన్య ఆడబిడ్డ సంచలనం .. రాష్ట్ర మంత్రిగా ఇళ్లల్లో పనులు చేసుకునే మహిళ !
-
Sajjala Ramakrishna Reddy: హామీలు గాలికొదిలేశారు.. సర్కార్పై సజ్జల తీవ్ర విమర్శలు..
-
RCB Fans: కప్ గెలిచిన ఆనందం కొన్ని క్షణాలు కూడా లేకపాయే.. ఆర్సీబీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..
-
Virat Kohli: నన్ను త్వరగా అవుట్ చేయాలని అందరూ చూస్తారు.. ఏం పర్లేదు, నా ప్లాన్స్ నాకుంటాయి!
-
Romantic Drama : తాగుబోతు ప్రేమకు ఇంత డిమాండా? ఐయండిబిలో 8.7 రేటింగ్
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!