Amit Shah: కేరళ విలయంపై రాజ్యసభలో అమిత్ షా కీలక ప్రకటన
- కేరళ విలయంపై రాజ్యసభలో అమిత్ షా కీలక ప్రకటన
- వారం ముందుగానే హెచ్చరించినట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళ విలయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో స్పందించారు. వయనాడ్లో కొండచరియలు విరిగిపడగానికి వారం రోజుల ముందే కేరళలోని పినరయ విజయన్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు అమిత్ షా స్పష్టం చేశారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వానికి జులై 23న ముందస్తు హెచ్చరికలు చేసిందని అమిత్ షా రాజ్యసభలో పేర్కొన్నారు. ముందు చర్యల్లో భాగంగా తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేరళకు పంపించామని.. కేరళ ప్రభుత్వం సకాలంలో ప్రజలను తరలించలేదని అమిత్ షా రాజ్యసభలో ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాల గురించి కనీసం ఏడు రోజుల ముందుగానే హెచ్చరికలు ఇవ్వగల నాలుగు దేశాల్లో భారతదేశం ఒకటి అని గుర్తుచేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల రాకతో కేరళ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటే మరణాల సంఖ్య తగ్గి ఉండేదని చెప్పారు. కేంద్రం.. కేరళ రాష్ట్రానికి అండగా ఉంటామని.. అంతేకాకుండా ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారని చెప్పారు.
ఇది కూడా చదవండి: Telangana: నాగదేవత అంటూ ఏళ్లుగా పూజలు.. చివరకు ఆ పాము కాటుతోనే మృతి..
Also Read
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
- Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
- CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
మంగళవారం వాయనాడ్ జిల్లాలో సంభవించిన కొండచరియలు విరిగిపడటంతో 204 మందికి పైగా మరణించారు. మరో 200 మంది గాయపడ్డారు. గల్లంతైన 180 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకోవైపు వాలంటీర్లు కూడా సాయం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: మదనపల్లి ఫైల్స్ ఘటనపై సీఎం చంద్రబాబును కలిసిన సీపీఐ బృందం
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, "… Under this early warning system, on July 23, at my direction, 9 NDRF teams were sent to Kerala considering that there could be landslides… What did the Kerala government do? Were the people shifted? And if they were… pic.twitter.com/P29bTb2buk
— ANI (@ANI) July 31, 2024
తాజావార్తలు
-
Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
-
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
-
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
-
Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
-
CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..