Kerala Congress: కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గద్దె దించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. కేరళలోని మొత్తం 140 స్థానాలకు గానూ యూడీఎఫ్ కూటమి 102 స్థానాలు గెలుచుకుంది. ఎల్డీఎఫ్ కేవలం 35 స్థానాలు సాధించింది. ఈసారి కేరళ అసెంబ్లీకి బీజేపీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 3 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ను కొత్త సమస్య వేధిస్తోంది. కాంగ్రెస్ అంటేనే వర్గపోరు ఖచ్చితంగా ఉంటుంది. ఇది కేరళలో కూడా తప్పకపోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ల మధ్య అధికార పోరు తారాస్థాయికి చేరింది. వీరిద్దరి పంచాయితీ ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం వద్దకు వెళ్లింది. అయితే, దీనిపై అధిష్టానం ఎటూ తేల్చలేకపోతోంది. సరిగా ఇదే పరిస్థితి కేరళలో కూడా కనిపిస్తోంది.
Read Also: Akhilesh Yadav: ఐప్యాక్తో అఖిలేష్ యాదవ్ తెగదెంపులు.. నమ్మకం పోయిందా? భయం పట్టుకుందా?
కేరళలో సీఎం పీఠాన్ని కాంగ్రెస్ నుంచి ముగ్గురు నేతలు ఆశిస్తున్నారు. ముఖ్యంగా వీడీ సతీషన్, రమేష్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ పేర్లు ప్రముఖ్యంగా వినిపిస్తున్నాయి. వీరి అనుచరులు సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారరు. తదుపరి ముఖ్యమంత్రి వీడీ సతీషన్ అంటూ సోషల్ మీడియా ‘‘VDS’’ అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేశారు.
ఇదిలా ఉంటే, కేసీ వేణు గోపాల్కు మద్దతుగా ఆన్లైన్లో ప్రచారం ఊపందుకుంది. కొంత మంది యూజర్లు రమేష్ చెన్నితాలకు మద్దతు ప్రకటిస్తున్నారు. మరొకొందరు కాంగ్రెస్ నేతలు తమ నాయకుడికి సీఎం పోస్టు ఇవ్వకపోతే పార్టీ నుంచి వైదొలుగుతామంటూ పోస్టులు పెడుతూ బెదిరిస్తున్నారు.
