Akhilesh Yadav: ఐప్యాక్తో అఖిలేష్ యాదవ్ తెగదెంపులు.. నమ్మకం పోయిందా? భయం పట్టుకుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సెగ ఇప్పుడు యూపీకి తాకింది. బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఓటమి, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ (SP) వ్యూహాల్లో పెను మార్పులకు కారణమైంది. దీదీ ఓటమీతో ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్తల సంస్థ ఐప్యాక్ (I-PAC)తో ఎస్పీ తన సంబంధాలను తెంచుకుంది. నిజానికి వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అఖిలేష్ యాదవ్, క్షేత్రస్థాయిలో సర్వేలు, సోషల్ మీడియా నిర్వహణ కోసం ఐప్యాక్ను నియమించుకున్నారు. అయితే బెంగాల్, తమిళనాడు ఫలితాల తర్వాత ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
మమతా బెనర్జీ సూచనతో ఐప్యాక్ను నియమించుకున్న అఖిలేష్, అక్కడ టీఎంసీ ఓడిపోవడంతో ఆ సంస్థ వ్యూహాలపై నమ్మకం కోల్పోయినట్లు తెలుస్తోంది. ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్ను మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడం ఎస్పీ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేసింది. ఎన్నికల సమయంలో అనవసరమైన రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక అఖిలేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఐప్యాక్ బృందంలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల వారు ఉండటం వల్ల యూపీ రాజకీయాలపై వారికి పూర్తి అవగాహన లేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
- సొంతిల్లు లేని వారికి గుడ్న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
- DILRMP 3.0: ఇకపై మీ భూమికి కూడా 'ఆధార్' లాంటి నెంబర్.. కేంద్రం సరికొత్త పథకం ప్రారంభం.!
ముందస్తు జాగ్రత్తలో అఖిలేష్..
కేవలం రెండున్నర నెలల క్రితమే కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వెనుక డేటా భద్రత కూడా ఒక కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీకి సంబంధించిన కీలక పత్రాలు, రహస్య సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉందని భయపడిన అఖిలేష్, ముందుగానే అప్రమత్తమయ్యారని అంటున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన స్థానాలపై ఐప్యాక్ దృష్టి సారించాల్సి ఉండగా, ఇప్పుడు ఆ బాధ్యతలను మార్చేస్తున్నారు.
ఇకపై వ్యూహకర్త ఎవరంటే..
ఐప్యాక్ నిష్క్రమణతో ఎస్పీ తన అంతర్గత బృందం, స్థానిక నాయకులపైనే ఎక్కువ భారం వేయనుందని సమాచారం. ఇప్పటికే డిజిటల్ ప్రచారం, సోషల్ మీడియా బాధ్యతలు చూస్తున్న ‘షో టైమ్’ సంస్థ తన పనిని కొనసాగిస్తుంది. భవిష్యత్తులో ఈ సంస్థ పాత్రను మరింత పెంచే అవకాశం ఉందని సమాచారం. బయటి ఏజెన్సీల కంటే క్షేత్రస్థాయిలో పట్టున్న తన సొంత కార్యకర్తలు, నాయకులను నమ్ముకోవాలని అఖిలేష్ నిర్ణయించుకున్నారు. వీటన్నింటిని గమనిస్తుంటే.. వ్యూహకర్తల కంటే తన సొంత బలగంతోనే 2027లో అధికారంలోకి రావాలని అఖిలేష్ యాదవ్ కృతనిశ్చయంతో ఉన్నారు.
తాజావార్తలు
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?