Kerala Black Magic: కేరళలో మరో క్షుద్రపూజ ఘటన.. మహిళ అరెస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Black Magic case: కేరళ పతినంతిట్ట జిల్లాలో ఇద్దరు మహిళలను అత్యంత కిరాతకంగా నరబలి ఇచ్చిన సంఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. అత్యంత ఆటవికంగా ఇద్దరు మహిళలను చంపి శరీర భాగాలను వండుకుని తినడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. విచారణలో విస్తూ పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒక మహిళ శరీరాన్ని 56 భాగాలుగా, మరో మహిళ శరీరాన్ని 5 భాగాలుగా ముక్కలు ముక్కలు చేశారు. జుగుప్సాకరంగా వారి శరీరభాగాలను వండుకుని తినడంతో పాటు బ్రెయిన్ సూప్ చేసుకుని తిన్నారు.
Read Also: Maharashtra: 13 మందిని చంపిన పులి పట్టుబడింది.
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
ఇదిలా ఉంటే మరో క్షుద్రపూజ కేరళలో కలకలకం సృష్టించింది. ఇది కూడా పతినంతిట్ట జిల్లాలోనే చోటు చేసుకుంది. జిల్లాలోని మళయాళపూజ గ్రామంలో చిన్నారులకు క్షుద్ర పూజ అభ్యసానికి సంబంధించిన మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అయింది. ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న 41 ఏళ్ల శోభన అలియాస్ వాసంతి అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలను ఇలా భయంకరమైన క్షుద్రవిద్యల్లో పాల్గొనేలా చేసినందుకు మహిళను అరెస్ట్ చేశారు. నిందితురాలైన మహిళ భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు నుంచి మహిళను అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి.
దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన పతనంతిట్ట జిల్లా ఇద్దరు మహిళల నరబలి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కొచ్చి సిటీ డిప్యూటీ కమిషనర్ ఎస్ శశిధరన్ ఈ సిట్ కు నేతృత్వం వహిస్తున్నారు. ముగ్గురు నిందితులు షఫి అలియాస్ రషీద్, దంపతులు భగవల్ సింగ్-లైలాను మంగళవారం అరెస్ట్ చేయగా.. వీరందరికి 12 రోజుల పోలీస్ కస్టడీ విధించింది కోర్టు. ఇద్దరు మహిళలను ప్రలోభపెట్టి, వారిని చిత్ర హింసలకు గురిచేసి, వ్యక్తిగత భాగాల్లోకి పదునైన ఆయుధాను చొప్పించి చిత్రహింసలకు గురిచేశారు. ప్రధాన సూత్రధారి షఫీ అని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!