Kerala Black Magic: కేరళలో మరో క్షుద్రపూజ ఘటన.. మహిళ అరెస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Black Magic case: కేరళ పతినంతిట్ట జిల్లాలో ఇద్దరు మహిళలను అత్యంత కిరాతకంగా నరబలి ఇచ్చిన సంఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. అత్యంత ఆటవికంగా ఇద్దరు మహిళలను చంపి శరీర భాగాలను వండుకుని తినడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. విచారణలో విస్తూ పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒక మహిళ శరీరాన్ని 56 భాగాలుగా, మరో మహిళ శరీరాన్ని 5 భాగాలుగా ముక్కలు ముక్కలు చేశారు. జుగుప్సాకరంగా వారి శరీరభాగాలను వండుకుని తినడంతో పాటు బ్రెయిన్ సూప్ చేసుకుని తిన్నారు.
Read Also: Maharashtra: 13 మందిని చంపిన పులి పట్టుబడింది.
Also Read
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
ఇదిలా ఉంటే మరో క్షుద్రపూజ కేరళలో కలకలకం సృష్టించింది. ఇది కూడా పతినంతిట్ట జిల్లాలోనే చోటు చేసుకుంది. జిల్లాలోని మళయాళపూజ గ్రామంలో చిన్నారులకు క్షుద్ర పూజ అభ్యసానికి సంబంధించిన మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అయింది. ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న 41 ఏళ్ల శోభన అలియాస్ వాసంతి అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలను ఇలా భయంకరమైన క్షుద్రవిద్యల్లో పాల్గొనేలా చేసినందుకు మహిళను అరెస్ట్ చేశారు. నిందితురాలైన మహిళ భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు నుంచి మహిళను అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి.
దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన పతనంతిట్ట జిల్లా ఇద్దరు మహిళల నరబలి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కొచ్చి సిటీ డిప్యూటీ కమిషనర్ ఎస్ శశిధరన్ ఈ సిట్ కు నేతృత్వం వహిస్తున్నారు. ముగ్గురు నిందితులు షఫి అలియాస్ రషీద్, దంపతులు భగవల్ సింగ్-లైలాను మంగళవారం అరెస్ట్ చేయగా.. వీరందరికి 12 రోజుల పోలీస్ కస్టడీ విధించింది కోర్టు. ఇద్దరు మహిళలను ప్రలోభపెట్టి, వారిని చిత్ర హింసలకు గురిచేసి, వ్యక్తిగత భాగాల్లోకి పదునైన ఆయుధాను చొప్పించి చిత్రహింసలకు గురిచేశారు. ప్రధాన సూత్రధారి షఫీ అని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
-
Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!