Kerala Black Magic: కేరళలో మరో క్షుద్రపూజ ఘటన.. మహిళ అరెస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Black Magic case: కేరళ పతినంతిట్ట జిల్లాలో ఇద్దరు మహిళలను అత్యంత కిరాతకంగా నరబలి ఇచ్చిన సంఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. అత్యంత ఆటవికంగా ఇద్దరు మహిళలను చంపి శరీర భాగాలను వండుకుని తినడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. విచారణలో విస్తూ పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒక మహిళ శరీరాన్ని 56 భాగాలుగా, మరో మహిళ శరీరాన్ని 5 భాగాలుగా ముక్కలు ముక్కలు చేశారు. జుగుప్సాకరంగా వారి శరీరభాగాలను వండుకుని తినడంతో పాటు బ్రెయిన్ సూప్ చేసుకుని తిన్నారు.
Read Also: Maharashtra: 13 మందిని చంపిన పులి పట్టుబడింది.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
ఇదిలా ఉంటే మరో క్షుద్రపూజ కేరళలో కలకలకం సృష్టించింది. ఇది కూడా పతినంతిట్ట జిల్లాలోనే చోటు చేసుకుంది. జిల్లాలోని మళయాళపూజ గ్రామంలో చిన్నారులకు క్షుద్ర పూజ అభ్యసానికి సంబంధించిన మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అయింది. ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న 41 ఏళ్ల శోభన అలియాస్ వాసంతి అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలను ఇలా భయంకరమైన క్షుద్రవిద్యల్లో పాల్గొనేలా చేసినందుకు మహిళను అరెస్ట్ చేశారు. నిందితురాలైన మహిళ భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు నుంచి మహిళను అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి.
దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన పతనంతిట్ట జిల్లా ఇద్దరు మహిళల నరబలి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కొచ్చి సిటీ డిప్యూటీ కమిషనర్ ఎస్ శశిధరన్ ఈ సిట్ కు నేతృత్వం వహిస్తున్నారు. ముగ్గురు నిందితులు షఫి అలియాస్ రషీద్, దంపతులు భగవల్ సింగ్-లైలాను మంగళవారం అరెస్ట్ చేయగా.. వీరందరికి 12 రోజుల పోలీస్ కస్టడీ విధించింది కోర్టు. ఇద్దరు మహిళలను ప్రలోభపెట్టి, వారిని చిత్ర హింసలకు గురిచేసి, వ్యక్తిగత భాగాల్లోకి పదునైన ఆయుధాను చొప్పించి చిత్రహింసలకు గురిచేశారు. ప్రధాన సూత్రధారి షఫీ అని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..