Kejriwal: కేజ్రీవాల్కు హర్యానా కోర్టు సమన్లు.. ఫిబ్రవరి 17న హాజరుకావాలని ఆదేశం
- కేజ్రీవాల్కు హర్యానా కోర్టు సమన్లు
- ఫిబ్రవరి 17న హాజరుకావాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం యమునా జలాల్లో విష ప్రయోగం జరిపినట్లుగా మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ తీవ్ర దుమారం రేపాయి. ప్రధాని మోడీ సహా కేంద్ర పెద్దలు, హర్యానా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హర్యానా ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేజ్రీవాల్పై కేసు నమోదైంది. యమునా నీటిని గురించి కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశారని.. దీంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్షన్ల కింద సోనిపట్లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదైంది. ఫిబ్రవరి 17న న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకాకపోతే తదుపరి చర్యలు చట్టానికి అనుగుణంగా ఉంటాయని కోర్టు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Non Veg : హైదరాబాద్లో రేపు నాన్ వెజ్ షాపులు బంద్.. ఎందుకంటే..!
Also Read
ఇదిలా ఉంటే హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ యమునా నది నీటిని తాగారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేజ్రీవాల్ తప్పుడు ఆరోపణలు చేశారని సైనీ పేర్కొన్నారు. బుధవారం యమునా నది నీరు తాగినట్లుగా తెలిపారు. అయితే నీరు విషపూరితంగా ఉండడంతో నయాబ్ సింగ్ సైనీ నీళ్లు తాగినట్లు నటించి.. వెంటనే నదిలో ఉమ్మేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. వాళ్లు తాగలేని నీళ్లు ఢిల్లీ ప్రజలకు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారని.. అలా ఎప్పటికీ జరగనివ్వని పేర్కొన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఎక్స్ ట్విట్టర్లో వీడియో పోస్టు చేశారు.
हरियाणा के मुख्यमंत्री नायब सिंह सैनी जी ने यमुना का पानी पीने का ढोंग किया… और फिर वही पानी वापस यमुना में थूक दिया।
जब मैंने कहा कि अमोनिया की मिलावट के कारण यमुना का पानी दिल्लीवालों की जान के लिए ख़तरा हो सकता है, तो इन्होंने मुझ पर FIR करने की धमकी दी।
जिस ज़हरीले पानी… pic.twitter.com/xQEVAu9bWh
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 29, 2025
తాజావార్తలు
-
Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!