Kedarnath: తెరచుకున్న కేదార్నాథ్.. భక్తుల పులకింత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ శైవక్షేత్రం కేదార్నాథ్ ఆలయం ఇవాళ తెరుచుకుంది.. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు.. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ ఆలయాన్ని ఇవాళ ఉదయం 6.26 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు, శివనామ స్మరణమధ్య ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి.. దీంతో, భక్తులు తన్మయతంలో పులకించిపోయారు. ఈ పవిత్రోత్సవాన్ని తిలకించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Read Also: Movie Tickets: ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయం.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Also Read
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
ఇక, అంతకుముందు, మే 3న, అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి మరియు యమునోత్రి యొక్క పోర్టల్స్ తెరవబడ్డాయి, ఇది చార్ ధామ్ యాత్ర 2022 ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది… భక్తుల కోసం ఆలయ తలుపులు తెరవడానికి కొన్ని గంటల ముందు, సీఎం పుష్కర్ సింగ్ ధామి.. ట్విట్టర్ పోస్ట్ ద్వారా, భక్తులకు స్వాగతం పలికారు.. తన ప్రభుత్వం సురక్షితమైన ప్రయాణాన్ని అందజేస్తుందని హామీ ఇచ్చారు. కాగా, 6 నెలల తర్వాత కేదారేశ్వరుని ఆలయాన్ని ఓపెన్ చేశారు.. ఈ ఆలయం ఏడాదిలో చాలాకాలం పాటూ మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి.. ఆ సమయంలో క్షేత్రాన్ని ప్రతీ ఏడాది మూసివేస్తారు. ఇప్పుడు పరిస్థితులు మళ్లీ సాధారణం కావడంతో ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు.
అయితే, కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా చార్ ధామ్ యాత్ర 2022 కోసం యాత్రికుల సంఖ్యపై ప్రభుత్వం రోజువారీ పరిమితిని నిర్ణయించిన విషయాన్ని యాత్రికులు గమనించాలి. అధికారులు కేదార్నాథ్ ఆలయానికి రోజువారీ పరిమితిని 12,000, బద్రీనాథ్కు 15,000గా నిర్ణయించారు.. మరోవైపు, చార్ ధామ్ యాత్రకు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ లేదా కోవిడ్ టీకా సర్టిఫికేట్ తప్పనిసరి కాదని తెలిపింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం.
తాజావార్తలు
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!