KCR: చంఢీగడ్ కు కేసీఆర్… రైతులకు పరిహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. శనివారం సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తో సమావేశం అయిన ఆయన రెండున్నర గంటల పాటు దేశ రాజకీయాలపై ముచ్చటించారు. ఆ తరువాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియాతో కలిసి సర్వోదయ స్కూల్ ను సందర్శించారు.
తాజాగా ఈ రోజు సీఎం చంఢీగడ్ వెళ్లనున్నారు. గతంలో హామీ ఇచ్చిన విధంగా రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. రైతు ఉద్యమంలో దాదాపుగా 600 మంది రైతుల చనిపోయారు. వీరందరికి చెక్కులు పంపిణీ చేయనున్నారు. దీని కన్నా ముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ కానున్నారు కేసీఆర్. కేజ్రీవాల్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ప్రస్తుతం రాజకీయాలపై ఇరు నేతలు చర్చించుకోనున్నారు. మధ్యాహ్నం భోజనం తరువాత కేజ్రీవాల్ తో కలిసి చంఢీగడ్ వెళ్లనున్నారు సీఎం కేసీఆర్.
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
దేశ రాజకీయాలపై తన ముద్ర వేసేలా కేసీఆర్ ఇండియా టూర్ చేపట్టారు. నిన్న అఖిలేష్ యాదవ్ తో భేటీ అయిన కేసీఆర్.. సాయంత్రం ప్రముఖ జర్నలిస్ట్ ప్రణవ్ రాయ్ తో సమావేశం అయ్యారు. తాజాగా ఆదివారం అరవింద్ కేజ్రీవాల్ తో రాజకీయాలపై చర్చించనున్నారు. నిన్న సర్వోదయం స్కూల్ సందర్శన సమయంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో సంచలనం జరగబోతోందని… మీరే చూస్తారంటూ హింట్ ఇచ్చారు. ఇదే విధంగా కేంద్రం తీసుకువస్తున్న ఎడ్యుకేషన్ పాలసీ ఏకపక్షంగా ఉందని.. రాష్ట్రాలతో సంప్రదింపులు జరపలేదని కేంద్రాన్ని విమర్శించారు.
ఇదిలా ఉంటే ఈ నెల 26న మాజీ ప్రధాని దేవెగౌడతో బెంగళూర్ లో సమావేశం కానున్నారు కేసీఆర్. ఆ తరువాత మే 27న మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి గ్రామంలో పర్యటించనున్నారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో సమావేశం కానున్నారు. ఈ నెల 29,30 తేదీల్లో బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. గల్వాన్ లోయలో చైనాతో జరిగిన వీర పోరాటంలో అసువులుబాసిన భారత సైనికుల కుటుంబాలను పరామర్శించనున్నారు.
తాజావార్తలు
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
-
OG 2: ‘ఓజీ’ యూనివర్స్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!