Pakistan: వాఘా బోర్డర్లో కాశ్మీర్ వేర్పాటువాది ఫోటో.. ప్రజల్ని ఏమారుస్తున్న పాకిస్తాన్..
- కాశ్మీర్తో తన ప్రజల్ని ఏమారుస్తున్న పాకిస్తాన్..
- వాఘా సరిహద్దు వద్ద కాశ్మీరి వేర్పాటువాది సయ్యద్ అలీషా గిలానీ ఫోటో..
- జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ముందు పాకిస్తాన్ దుష్ట ప్రయత్నం..
- నిరసన తెలిపిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ తన సమస్యల నుంచి దృష్టిని మళ్లించేందుకు కాశ్మీర్ని సాధనంగా వాడుకుంటోంది. అ దేశంలో ప్రజలు తినడానికి తిండి లేకున్నా, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కూడా ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా కాశ్మీర్ తమ ప్రాధాన్యత ఎజెండాగా ఉంచుతోంది. ఇదిలా ఉంటే, తాజాగా భారత్-పాకిస్తాన్ సరిహద్దు వాఘా-అట్టారి బోర్డర్ వద్ద కాశ్మీర్ వేర్పాటువాద నేత దివంగత సయ్యద్ అలీ షా గిలానీ ఫోటోతో కూడా పెద్ద బోర్డును ఏర్పాటు చేసింది. ఇరు దేశాల ఉమ్మడి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద ఈ ఫోటో కనిపిస్తోంది.
Read Also: AG Noorani: సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది ఏజీ నూరానీ(93) కన్నుమూత
Also Read
జమ్మూ కాశ్మీర్లో ఇటీవల తీవ్రవాద దాడులు పెరగడం, మరికొన్ని రోజుల్లో కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ ఫోటోని ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్లోని వాఘా వైపు జాయింట్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద జెండా అవతరణ కార్యక్రమం జరిగే ప్రదేశానికి సమీపంలో జిలానీ ఫోటోని ఏర్పాటు చేశారు. అయితే, దీనిపై భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) పాకిస్తాన్ రేంజర్లకు నిరసన తెలిపినట్లు తెలుస్తోంది. హురియత్ కాన్ఫరెన్స్ నేత ఫోటోలను పాకిస్తాన్ తన వైపు ప్రదర్శించిందని, ఉమ్మడి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు ప్రాంతం రాజకీయ ప్రదర్శనకు వేదిక కావద్దని భారత్ సూచించినట్లు తెలిసింది.
ఈ చర్య అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడంతో పాటు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కలుగజేసుకునే ఉద్దేశంతోనే పాకిస్తాన్ ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశంలో పేదరికం, ద్రవ్యో్ల్భణం, ఇటీవల బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషర్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఏకంగా 70 మంది వరకు పాక్ సైనికులు చనిపోయిన విషయాలను పక్కదారి పట్టించేదుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!