Pakistan: వాఘా బోర్డర్లో కాశ్మీర్ వేర్పాటువాది ఫోటో.. ప్రజల్ని ఏమారుస్తున్న పాకిస్తాన్..
- కాశ్మీర్తో తన ప్రజల్ని ఏమారుస్తున్న పాకిస్తాన్..
- వాఘా సరిహద్దు వద్ద కాశ్మీరి వేర్పాటువాది సయ్యద్ అలీషా గిలానీ ఫోటో..
- జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ముందు పాకిస్తాన్ దుష్ట ప్రయత్నం..
- నిరసన తెలిపిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ తన సమస్యల నుంచి దృష్టిని మళ్లించేందుకు కాశ్మీర్ని సాధనంగా వాడుకుంటోంది. అ దేశంలో ప్రజలు తినడానికి తిండి లేకున్నా, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కూడా ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా కాశ్మీర్ తమ ప్రాధాన్యత ఎజెండాగా ఉంచుతోంది. ఇదిలా ఉంటే, తాజాగా భారత్-పాకిస్తాన్ సరిహద్దు వాఘా-అట్టారి బోర్డర్ వద్ద కాశ్మీర్ వేర్పాటువాద నేత దివంగత సయ్యద్ అలీ షా గిలానీ ఫోటోతో కూడా పెద్ద బోర్డును ఏర్పాటు చేసింది. ఇరు దేశాల ఉమ్మడి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద ఈ ఫోటో కనిపిస్తోంది.
Read Also: AG Noorani: సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది ఏజీ నూరానీ(93) కన్నుమూత
Also Read
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్గా మారిన స్వీట్!
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
జమ్మూ కాశ్మీర్లో ఇటీవల తీవ్రవాద దాడులు పెరగడం, మరికొన్ని రోజుల్లో కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ ఫోటోని ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్లోని వాఘా వైపు జాయింట్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద జెండా అవతరణ కార్యక్రమం జరిగే ప్రదేశానికి సమీపంలో జిలానీ ఫోటోని ఏర్పాటు చేశారు. అయితే, దీనిపై భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) పాకిస్తాన్ రేంజర్లకు నిరసన తెలిపినట్లు తెలుస్తోంది. హురియత్ కాన్ఫరెన్స్ నేత ఫోటోలను పాకిస్తాన్ తన వైపు ప్రదర్శించిందని, ఉమ్మడి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు ప్రాంతం రాజకీయ ప్రదర్శనకు వేదిక కావద్దని భారత్ సూచించినట్లు తెలిసింది.
ఈ చర్య అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడంతో పాటు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కలుగజేసుకునే ఉద్దేశంతోనే పాకిస్తాన్ ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశంలో పేదరికం, ద్రవ్యో్ల్భణం, ఇటీవల బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషర్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఏకంగా 70 మంది వరకు పాక్ సైనికులు చనిపోయిన విషయాలను పక్కదారి పట్టించేదుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!