Vivek Agnihotri: సీఎం మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపిన “కాశ్మీర్ ఫైల్స్” డైరెక్టర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivek Agnihotri: ‘‘ది కాశ్మీర్ ఫైల్స్’’ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని వివేక్ అగ్నిహోత్రి మంగళవారం తెలిపారు. అయితే ఈ లీగల్ నోలీసుపై తమకు ఎలాంటి సమాచారం లేదని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. తన సినిమా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ పరువు తీసినందుకు నోటీసులు పంపారు. ఇటీవల విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ సినిమాను బ్యాన్ చేస్తున్నట్లు సోమవారం మమతాబెనర్జీ ప్రకటించారు. అలాగే ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సమాజంలో ఓ వర్గాన్ని కించపరిచేలా చేసిందని ఆమె విమర్శించారు. వివేక్ అగ్నిహోత్రి, ఆయన భార్య పల్లవి జోషి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి ఈ లీగల్ నోటీసులు పంపినట్లు అగ్నిహోత్రి తెలిపారు. ఈ లీగల్ కాపీని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
Read Also: Largest Theatres: భారతదేశంలోని టాప్-10 అతిపెద్ద సినిమా థియేటర్లు
Also Read
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
- Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
వివేక్ అగ్నిహోత్రి గతేడాది రూపొందించిన కాశ్మీర్ ఫైల్స్ రికార్డ్ కలెక్షన్లు సాధించి భారీ విజయాన్ని సాధించింది. అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి నటించిన ఈ సినిమా కాశ్మీర్లో హిందువుల ఊచకోతకు సంబంధించిన వృత్తాంతం ఆధారంగా రూపొందించబడింది. అయితే ఇది తప్పుడు సమాచారం ఆధారంగా రూపొందించబడిందని, బీజేపీ అందించిన నిధుల సహకారంతో నిర్మించారని పలు విపక్షాలు ఆరోపించాయి.
ఇదిలా ఉంటే కొంతమంది బీజేపీ అందించే నిధులతో ‘బెంగాల్ ఫైల్స్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారని మమతా బెనర్జీ మండిపడ్డారు. ఇప్పటికే కాశ్మీర్ ప్రజల్ని అవమానపరిచారని, ‘ ది కేరళ స్టోరీ’ సినిమాతో కేరళ రాష్ట్రపరువు తీశారని సోమవారం ఆమె విమర్శించారు. సుదీప్తో సేన్ దర్శకత్వంతో రూపొందిని కేరళ స్టోరి సినిమా రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. కేరళలో మతమార్పిడులు, లవ్ జీహాద్, ఉగ్రవాదం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఇవన్నీ కేవలం సంఘ్ పరివార్ అబద్ధపు ప్రచారమని కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శించారు. తమిళనాడులో ఈ సినిమా ప్రదర్శనను మల్టీప్లెక్సుల్లో బ్యాన్ చేశారు. అయితే మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ సినిమాకు పన్ను మినహాయింపును ఇచ్చాయి.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
-
Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
-
China: జిన్పింగ్కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
-
DSP transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!