Neha Murder Case: “నా కొడుకు చేసింది తప్పే”.. క్షమాపణలు కోరిన నిందితుడు ఫయాజ్ తల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neha Murder Case: కర్ణాటక హుబ్బళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహా హిమరేత్ని అత్యంత దారుణంగా పొడిచి చంపడం ఆ రాష్ట్రంలో రాజకీయంగా వివాదాస్పదమైంది. హుబ్బళ్లిలో ఓ కాలేజీలో ఏంసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నేహ(23)ని ఆమె సీనియర్ విద్యార్థి ఫయాజ్ హత్య చేశాడు. ఈ ఘటన కాలేజ్ క్యాంపస్లో జరిగింది. ఈ హత్యకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. ఈ హత్య కేసులో నిందితడు ఫయాజ్ని అరెస్ట్ చేశారు. కత్తిపోట్ల కారణంగానే బాధితురాలు చనిపోయిందని పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనలో ‘‘లవ్ జిహాద్’’ కోణం ఉందని బీజేపీ ఆరోపించింది. చివరకు ఆమె తండ్రి కాంగ్రెస్ కార్పొరేటర్ కూడా నిరంజన్ హిరేమత్ కూడా.. తన కూతురును ట్రాప్ చేసేందుకు ప్లాన్ చేశారని, అందుకు లొంగకపోవడంతోనే హత్య జరిగిందని ఆరోపించారు. అయితే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి నేతలు మాత్రం ఇది వ్యక్తిగత వివాదమని, ఇందులో లవ్ జిహాద్ కోణం లేదని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, నిందితుడు ఫయాజ్ తల్లి ముంతాజ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నా కొడుకు తరుపున నేను కర్ణాటక ప్రజలందరికీ క్షమించమని కోరుతున్నాను. నేను అమ్మాయి తల్లిదండ్రుల్ని కూడా క్షమించాలని కోరుతున్నాను. ఆమె నా కూతురు లాంటిది. నేను ఇక్కడ ఎలాంటి భేదం చూపడం లేదు. వారు ఎలా బాధపడుతున్నారో నాకు తెలుసు. నేను కూడా అంతే బాధతో ఉన్నానను. నా కొడుకు చేసింది తప్పే. అతను నా కొడుకైనా తప్పు తప్పే’’ అని అన్నారు.
Also Read
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్ను స్పష్టం చేసిన మోడీ
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
Read Also: Shahid Afridi: “ఇది పొరుగువారి హక్కు”.. రోహిత్ శర్మ వ్యాఖ్యలపై అఫ్రిది రెస్పాన్స్..
తన కొడుకు చేసిన పనికి దేశ చట్టం ప్రకారం శిక్షించాల్సిందే అని ముంతాజ్ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే, తన కొడుకు, బాధితురాలు నేహ ప్రేమించుకున్నారని, ఈ విషయం నాకు గతేడాది కాలంగా తెలుసని చెప్పారు. అయితే, ఫయాజ్ తన కుమార్తెకు స్నేహితుడు మాత్రమే అని, నిందితుడితో ఎలాంటి రిలేషన్ లేదని అన్నారు. అయితే, అతను చేసిన ప్రపోజల్స్ని నేహ ప్రతీసారి తిరస్కరించదని చెప్పారు. ఇలాగే చేస్తే తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పినట్లు నేహా తండ్రి వెల్లడించారు.
ఈ కేసులో లవ్ జిహాద్ కోణం ఉందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అయితే ఈ ఆరోపణల్ని కర్ణాటక ప్రభుత్వం తోసిపుచ్చింది. నేహా, ఫయాజ్ మధ్య రిలేషన్షిప్ ఉందని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర అన్నారు. నేహా హత్యపై బీజేపీ, రైట్ వింగ్ కార్యకర్తలు హుబ్బళ్లిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కర్ణాటకలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ ఆరోపించింది. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలను సాకుగా చూపి బీజేపీ రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోందని కాంగ్రెస్ ప్రతి ఆరోపణలు చేసింది.
తాజావార్తలు
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
-
Forbes India: అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!