Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
- అత్యాచార నిందితుడి బెయిల్ పిటిషన్పై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు.
- "చట్టం తన పదును కోల్పోయింది" అంటూ కోర్టు ఆందోళన.
- నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే కఠిన శిక్షలు అవసరమని అభిప్రాయం.
- "చేతో, కాలో నరికేస్తేనే చట్టం పాటిస్తారేమో" అని వ్యాఖ్య.
- 23 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka High Court: అత్యాచార కేసు విచారణ సమయంలో కర్ణాటక హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిందితుడిగా ఉన్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థి బెయిల్ పిటిషన్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నేరాలను అరికట్టాలంటే కఠిన శిక్షలు అవసమరని కోర్టు అభిప్రాయపడుతూ.. ‘‘ఒకరి కాలు లేదా చెయ్యి నరికివేస్తే ప్రజలు చట్టాలను పాటిస్తారేమో’’ అని వ్యాఖ్యానించింది. 23 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్ సమయంలో జస్టిస్ ఆర్ నటరాజ్ ధర్మాసనం ఈ కామెంట్స్ చేసింది.
మన దేశంలో చట్టం తన పదును కోల్పోతోందని, కఠినమైన శిక్షలు ఉంటేనే ప్రజల్లో చట్టం పట్ల భయం పెరుగుతుందని, కొన్ని పశ్చిమాసియా దేశాల్లో కఠిన శిక్షల కారణంగా ప్రజలు చట్టాన్ని ఉల్లంఘించడానికి భయపడుతారు అని కోర్టు వ్యాఖ్యానించింది. నిందితుడి తరుపున న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్ దాదాపుగా రెండు నెలల నుంచి జైలులో ఉన్నాడని, తాను చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్నాడని వాదించారు.
Also Read
- West Bengal Politics: మమతా పార్టీలో ‘‘షిండే’’ రాజకీయాలు.. తృణమూల్లో తీవ్ర సంక్షోభం..
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
- Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?
- Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ఉప్పు తింటే నీళ్లు తాగాల్సిందే అని వ్యాఖ్యానించారు. అవసరమైతే నిందితుడు మరికొన్ని రోజులు జైలులో ఉండొచ్చని, భవిష్యత్తులో శిక్ష పడితే మళ్లీ జైలుకు వెళ్లా్ల్సి రావచ్చని అన్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 8కి వాయిదా వేసింది.
కేసు వివరాలను పరిశీలిస్తే.. ఈ కేసు మూడేళ్ల క్రితం నాటిది. నిందితుడు ఒక యువతిని స్నేహం పేరుతో మాట్లాడుకుందామని చెప్పి ఒక అపార్ట్మెంట్కు తీసుకెళ్లాడు. 2023 సెప్టెంబర్ 12న లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 375(a), 376 కింద నమోదు చేశారు. ఈ కేసులో ఉడుపి జిల్లా సెషన్స్ కోర్టు ఇప్పటికే నిందితుడి బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు.
తాజావార్తలు
-
Buchi Babu Sana: ‘ఆ విషయంలో చిరంజీవి గారు ఫోన్ చేసి తిడతారు ఏమో అనుకున్నా’: బుచ్చిబాబు
-
Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Palak Pakoda Recipe: సింపుల్గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
-
West Bengal Politics: మమతా పార్టీలో ‘‘షిండే’’ రాజకీయాలు.. తృణమూల్లో తీవ్ర సంక్షోభం..
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!