Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
- అత్యాచార నిందితుడి బెయిల్ పిటిషన్పై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు.
- "చట్టం తన పదును కోల్పోయింది" అంటూ కోర్టు ఆందోళన.
- నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే కఠిన శిక్షలు అవసరమని అభిప్రాయం.
- "చేతో, కాలో నరికేస్తేనే చట్టం పాటిస్తారేమో" అని వ్యాఖ్య.
- 23 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka High Court: అత్యాచార కేసు విచారణ సమయంలో కర్ణాటక హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిందితుడిగా ఉన్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థి బెయిల్ పిటిషన్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నేరాలను అరికట్టాలంటే కఠిన శిక్షలు అవసమరని కోర్టు అభిప్రాయపడుతూ.. ‘‘ఒకరి కాలు లేదా చెయ్యి నరికివేస్తే ప్రజలు చట్టాలను పాటిస్తారేమో’’ అని వ్యాఖ్యానించింది. 23 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్ సమయంలో జస్టిస్ ఆర్ నటరాజ్ ధర్మాసనం ఈ కామెంట్స్ చేసింది.
మన దేశంలో చట్టం తన పదును కోల్పోతోందని, కఠినమైన శిక్షలు ఉంటేనే ప్రజల్లో చట్టం పట్ల భయం పెరుగుతుందని, కొన్ని పశ్చిమాసియా దేశాల్లో కఠిన శిక్షల కారణంగా ప్రజలు చట్టాన్ని ఉల్లంఘించడానికి భయపడుతారు అని కోర్టు వ్యాఖ్యానించింది. నిందితుడి తరుపున న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్ దాదాపుగా రెండు నెలల నుంచి జైలులో ఉన్నాడని, తాను చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్నాడని వాదించారు.
Also Read
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్లో నిరసనలు
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ఉప్పు తింటే నీళ్లు తాగాల్సిందే అని వ్యాఖ్యానించారు. అవసరమైతే నిందితుడు మరికొన్ని రోజులు జైలులో ఉండొచ్చని, భవిష్యత్తులో శిక్ష పడితే మళ్లీ జైలుకు వెళ్లా్ల్సి రావచ్చని అన్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 8కి వాయిదా వేసింది.
కేసు వివరాలను పరిశీలిస్తే.. ఈ కేసు మూడేళ్ల క్రితం నాటిది. నిందితుడు ఒక యువతిని స్నేహం పేరుతో మాట్లాడుకుందామని చెప్పి ఒక అపార్ట్మెంట్కు తీసుకెళ్లాడు. 2023 సెప్టెంబర్ 12న లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 375(a), 376 కింద నమోదు చేశారు. ఈ కేసులో ఉడుపి జిల్లా సెషన్స్ కోర్టు ఇప్పటికే నిందితుడి బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు.
తాజావార్తలు
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్రూఫ్, 6 ఎయిర్బ్యాగ్స్తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్లో నిరసనలు
-
BCCI: కోచ్గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!