PFI: పీఎఫ్ఐపై నిషేధాన్ని సమర్థించిన కర్ణాటక హైకోర్టు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka High Court dismisses plea challenging ban on PFI: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను బుధవారం విచారించింది కర్ణాటక హైకోర్టు. పీఎఫ్ఐ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలు అయిన పిటిషన్ని కొట్టేసింది. నిషేధాన్ని సమర్థించింది. పీఎఫ్ఐ కర్ణాటక అధ్యక్షుడు నసీర్ పాషా ఈ పిటిషన్ దాఖలు చేశారు. పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలపై కేంద్ర విధించిన ఐదేళ్ల నిషేధాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ పై ఇంతకుముందు కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.
నిషేధాన్ని సమర్థించడంలో కేంద్రం విఫలం అయినట్లు పిటిషనర్ తరుపు న్యాయవాది హైకోర్టులో తన వాదనలు వినిపించారు. వివిధ నేరాలకు సంబంధించిన సంఘటనలను కేంద్ర పరిగణలోకి తీసుకుని నిషేధం విధించిందని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం మైనారిటీల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని పిటిషనర్ వాదించాడు. పీఎఫ్ఐపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేస్తూ జస్టిస్ ఎం నాగప్రసన్నతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
Read Also: China: భారత్-అమెరికా మిలిటరీ డ్రిల్స్పై చైనా అక్కసు.. భారత సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని వార్నింగ్
సెప్టెంబర్ 28న దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ సంస్థలు, నాయకులు, కార్యకర్తల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఈడీ సంస్థలు దాడులు చేశాయి. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుండటంతో పాటు మనీలాండరింగ్ కు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో కనుక్కున్నారు. దీంతో పాటు స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి), జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జెఎమ్బి), ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
1,400 మంది పీఎఫ్ఐ కార్యకర్తలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని.. వీటిలో రైట్ వింగ్ కార్యకర్తలను హత్య చేసిన కేసులు కూడా ఉన్నాయని కేంద్ర తెలిపింది. యూఏపీఏ చట్టం కింద సెప్టెంబర్ నెలలో ఈ సంస్థపై కేంద్రం నిషేధం విధించింది. మొత్తం 300 మందికి పైగా పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేసింది ప్రభుత్వం.
తాజావార్తలు
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!