PFI: పీఎఫ్ఐపై నిషేధాన్ని సమర్థించిన కర్ణాటక హైకోర్టు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka High Court dismisses plea challenging ban on PFI: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను బుధవారం విచారించింది కర్ణాటక హైకోర్టు. పీఎఫ్ఐ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలు అయిన పిటిషన్ని కొట్టేసింది. నిషేధాన్ని సమర్థించింది. పీఎఫ్ఐ కర్ణాటక అధ్యక్షుడు నసీర్ పాషా ఈ పిటిషన్ దాఖలు చేశారు. పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలపై కేంద్ర విధించిన ఐదేళ్ల నిషేధాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ పై ఇంతకుముందు కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.
నిషేధాన్ని సమర్థించడంలో కేంద్రం విఫలం అయినట్లు పిటిషనర్ తరుపు న్యాయవాది హైకోర్టులో తన వాదనలు వినిపించారు. వివిధ నేరాలకు సంబంధించిన సంఘటనలను కేంద్ర పరిగణలోకి తీసుకుని నిషేధం విధించిందని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం మైనారిటీల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని పిటిషనర్ వాదించాడు. పీఎఫ్ఐపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేస్తూ జస్టిస్ ఎం నాగప్రసన్నతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read
- PM Modi: "నీట్ పేపర్ లీక్ 'ఘోర పాపం'.. కఠిన శిక్ష తప్పదు".. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
- Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
- Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
Read Also: China: భారత్-అమెరికా మిలిటరీ డ్రిల్స్పై చైనా అక్కసు.. భారత సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని వార్నింగ్
సెప్టెంబర్ 28న దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ సంస్థలు, నాయకులు, కార్యకర్తల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఈడీ సంస్థలు దాడులు చేశాయి. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుండటంతో పాటు మనీలాండరింగ్ కు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో కనుక్కున్నారు. దీంతో పాటు స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి), జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జెఎమ్బి), ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
1,400 మంది పీఎఫ్ఐ కార్యకర్తలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని.. వీటిలో రైట్ వింగ్ కార్యకర్తలను హత్య చేసిన కేసులు కూడా ఉన్నాయని కేంద్ర తెలిపింది. యూఏపీఏ చట్టం కింద సెప్టెంబర్ నెలలో ఈ సంస్థపై కేంద్రం నిషేధం విధించింది. మొత్తం 300 మందికి పైగా పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేసింది ప్రభుత్వం.
తాజావార్తలు
-
Team India: టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం.. అప్పుడే ఒక వికెట్ డౌన్!
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
-
PM Modi: “నీట్ పేపర్ లీక్ ‘ఘోర పాపం’.. కఠిన శిక్ష తప్పదు”.. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Maruthi Next : మారుతీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్.. అవసరమా అధ్యక్ష్యా?
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?