Karnataka: ముగిసిన సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పదవీకాలం.. 50 శాతం మంత్రులను తొలగించే ఛాన్స్
- కర్ణాటకలో అధికార మార్పిడిపై కొనసాగుతున్న ఊహాగానాలు..
- త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఏఐసీసీ సూచనలు..
- ఈ నెల 13న కేబినెట్ మంత్రులకు సీఎం సిద్ధరామయ్య విందు భోజనాలు..
- అధికార మార్పిడి గురించి నాకు తెలియదు, ఇది సీఎంకే తెలుసు: డీకే శివకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్టోబర్ 13వ తేదీన అన్ని కేబినెట్ మంత్రులకు విందు ఇస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్తో జరిగిన చర్చల సందర్భంగా, ముఖ్యమంత్రి తన పదవీకాలం 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత నవంబర్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సూచనలు చేసినట్లు తెలుస్తుంది. కాగా, ప్రస్తుత మంత్రులలో 50 శాతం మందిని తొలగించి కొత్తవారిని తీసుకురావాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నవంబర్లో దాదాపు 15 మంది కొత్త మంత్రులను తీసుకుని సీఎంని వెంటనే మార్చడం హైకమాండ్కు కష్టమవుతుందని పార్టీ అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే కొత్త మంత్రివర్గం ఇప్పటికే అమల్లో ఉంది. బీహార్ ఎన్నికల తర్వాత వ్యూహాత్మకంగా ప్రణాళిక చేయబడిన ఈ పునర్వ్యవస్థీకరణ, నాయకత్వ మార్పు నిర్ణయాలకు ముందే పార్టీలో ముఖ్యమంత్రి స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సిద్ధరామయ్య ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
Read Also: రోడ్డుమార్గాన నర్సీపట్నానికి జగన్, పోలీసులు నిర్దేశించిన అనకాపల్లి,పెందుర్తి మీదుగా పర్యటన
Also Read
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
అయితే, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. అలాంటి సమాచారం నాకు తెలియదు, ఈ అంశం పూర్తిగా సీఎంకి వదిలివేయబడింది.. మనమందరం పార్టీ కోసం పనిచేస్తాం.. నేను దేంట్లోనూ జోక్యం చేసుకోను, నేను కేవలం సూచనలు మాత్రమే ఇవ్వగలను అన్నారు. ఎవరూ గందరగోళం సృష్టించకూడదు అని సూచించారు. కాగా, కర్ణాటకలో నాయకత్వ మార్పు గురించి కాంగ్రెస్ పార్టీలోనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 2.5 సంవత్సరాల తర్వాత నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందని కొందరు నేతలు సూచించడంతో, సిద్ధరామయ్య పదవీకాలం గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!