Karnataka: ముగిసిన సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పదవీకాలం.. 50 శాతం మంత్రులను తొలగించే ఛాన్స్
- కర్ణాటకలో అధికార మార్పిడిపై కొనసాగుతున్న ఊహాగానాలు..
- త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఏఐసీసీ సూచనలు..
- ఈ నెల 13న కేబినెట్ మంత్రులకు సీఎం సిద్ధరామయ్య విందు భోజనాలు..
- అధికార మార్పిడి గురించి నాకు తెలియదు, ఇది సీఎంకే తెలుసు: డీకే శివకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్టోబర్ 13వ తేదీన అన్ని కేబినెట్ మంత్రులకు విందు ఇస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్తో జరిగిన చర్చల సందర్భంగా, ముఖ్యమంత్రి తన పదవీకాలం 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత నవంబర్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సూచనలు చేసినట్లు తెలుస్తుంది. కాగా, ప్రస్తుత మంత్రులలో 50 శాతం మందిని తొలగించి కొత్తవారిని తీసుకురావాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నవంబర్లో దాదాపు 15 మంది కొత్త మంత్రులను తీసుకుని సీఎంని వెంటనే మార్చడం హైకమాండ్కు కష్టమవుతుందని పార్టీ అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే కొత్త మంత్రివర్గం ఇప్పటికే అమల్లో ఉంది. బీహార్ ఎన్నికల తర్వాత వ్యూహాత్మకంగా ప్రణాళిక చేయబడిన ఈ పునర్వ్యవస్థీకరణ, నాయకత్వ మార్పు నిర్ణయాలకు ముందే పార్టీలో ముఖ్యమంత్రి స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సిద్ధరామయ్య ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
Read Also: రోడ్డుమార్గాన నర్సీపట్నానికి జగన్, పోలీసులు నిర్దేశించిన అనకాపల్లి,పెందుర్తి మీదుగా పర్యటన
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
అయితే, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. అలాంటి సమాచారం నాకు తెలియదు, ఈ అంశం పూర్తిగా సీఎంకి వదిలివేయబడింది.. మనమందరం పార్టీ కోసం పనిచేస్తాం.. నేను దేంట్లోనూ జోక్యం చేసుకోను, నేను కేవలం సూచనలు మాత్రమే ఇవ్వగలను అన్నారు. ఎవరూ గందరగోళం సృష్టించకూడదు అని సూచించారు. కాగా, కర్ణాటకలో నాయకత్వ మార్పు గురించి కాంగ్రెస్ పార్టీలోనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 2.5 సంవత్సరాల తర్వాత నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందని కొందరు నేతలు సూచించడంతో, సిద్ధరామయ్య పదవీకాలం గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?