Karnataka: బీజేపీ కార్యకర్త హత్య.. వేడుకలను రద్దు చేసిన సీఎం బస్వరాజ్ బొమ్మై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karanataka BJP Youth Leader killed case: కర్ణాటకలో బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్య ప్రకంపనలు కలిగిస్తోంది. ఈ హత్యపై కర్ణాటకలోని బీజేపీ గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే సీఎం బస్వరాజ్ బొమ్మై ఈ హత్య నేపథ్యంలో నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రవీణ్ నెట్టార్ హత్యతో బొమ్మై సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తియిన సందర్భంగా జనోత్సవ వేడుకలను రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. బీఎస్ యడియూరప్ప, నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ల పూర్తి చేసుకుంది.. కానీ ప్రవీణ్ నెట్టారు హత్యతో ఆయన తల్లి, కుటుంబ సభ్యుల బాధను చూసి కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు బొమ్మై వెల్లడించారు. శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య జరిగిన కొన్ని రోజులకే ప్రవీణ్ నెట్టారు హత్య జరగడం నన్ను తీవ్రంగా బాధించిందని బొమై అన్నారు.
రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వింగ్ తో పాటు కమాండోల టాస్క్ ఫోర్స్ కు శిక్షణ ఇస్తామని.. ఇలాంటి హత్యలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారని ఆయన అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి.. మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నుతున్న దేశ వ్యతిరేక, టెర్రర్ గ్రూపులకు అడ్డుకట్ట వేసేందుకు కొత్తగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అయితే తాజాగా జరిగిన బీజేపీ కార్యకర్త హత్యలో అంతర్ రాష్ట్ర సమస్యలు కూడా ఉన్నాయని.. ఇప్పుడే వాటిని బయటపెట్టలేమని బస్వరాజ్ బొమ్మై అన్నారు. పీఎఫ్ఐ వంటి ఉగ్రవాద సంస్థ, వ్యక్తులను నిర్మూలించేందుకు ప్రత్యేక దళాన్ని రూపొందిస్తున్నామని అన్నారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Central Government Jobs: 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమందికి వచ్చాయంటే..
కర్ణాటకలో కాంగ్రెస్ హయాంలో మొత్తం 22 మంది యువకుల హత్యలు జరిగాయని.. వీటిపై అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని.. దీనికి బదులుగా ఈ ఘటనల వెనక ఉన్న సంస్థలపై 200 కేసులు ఉపసంహరించుకుందని.. దీంతో వారంతా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ యువ మోర్చా నేత ప్రవీణ్ నెట్టారును ఇంటికెళ్తున్న క్రమంలో దుండగులు వెంబడించి దారుణంగా చంపారు. ఈ ఘటనపై రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
తాజావార్తలు
-
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
-
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
-
God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
-
Peddi OTT Release: రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
-
Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!