Central Government Jobs: 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమందికి వచ్చాయంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Government Jobs in 8 years: ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరగడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్ లో మాట్లాడుతూ.. గడిచిన 8 ఏళ్లలో 7.22 లక్షల మందిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకున్నామని వెల్లడించారు. 2014-2022 మధ్య ఈ రిక్రూట్మెంట్ జరిగినట్లు బుధవారం పార్లమెంట్ లో వెల్లడించారు. మొత్తం 7,22,311 మందిని వివిధ శాఖల్లోకి తీసుకున్నామని తెలిపారు.
వీరిలో 2021-22లో 38,850 మందిని, 2020-21లో 78,555 మందిని, 2019-20లో 1,47,096 మందిని, 2018-19లో 38,100 మందిని, 2017-18లో 76,147 మందిని, 2016-17లో 1,01,333 మందిని, 2015-16లో 1,11,807 మందిని, 2014-15లో 1,30,423 మందిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. మొత్తం 22,05,99,238 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకుంటే 7.22 మందిని కేంద్ర కొలువుల్లోకి తీసుకున్నారు.
Also Read
- CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
- Abhijit Dipke: "నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు".. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
- CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
Read Also: Bhatti Vikramarka : బండి సంజయ్ ఉన్మాది.. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం
కేంద్రం ప్రభుత్వం ఉపాధి కల్పనకు అనేక చర్యలు తీసుకుంటుందని.. 2021-22 బడ్జెట్ నుంచి ప్రారంభం అయ్యే 5 ఏళ్లలో రూ. 1.97 లక్షల కోట్లతో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్( పీఎల్ఐ) పథకాన్ని ప్రారంభించినట్లు జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ పథకం కింద 60 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. సూక్ష్మ , చిన్న వ్యాపార సంస్థలకు, వ్యక్తులు తమ వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, విస్తరించడానికి వీలుగా రూ. 10 లక్షల వరకు ఎలాంటీ పూచికత్తు లేకుండా రుణాలను అందిస్తున్నామని అన్నారు.కోవిడ్ కారణంగా దెబ్బతిన్న వీధి వ్యాపారులను ఆదుకునేందుకు 2020 జూన్ 1 నుంచి ప్రధాన మంత్రి వీధి వ్యాపరుల ఆత్మనిర్మర్ నిధిని అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. పీఎం గతిశక్తి ద్వారా రానున్న రోజుల్లో సబ్కా ప్రయాస్ ద్వారా అందరికి భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Virat Kohli World Record: SRH మ్యాచ్లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
-
Takshaka : వశిష్ట తమ్ముడి డైరెక్షన్లో ‘తక్షక’
-
BSNL: బీఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్.. రూ. 51కే రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్
-
Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
-
CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!