Deepti Chaurasia: ఢిల్లీలో ప్రముఖ వ్యాపారి కోడలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే..!
- ఢిల్లీలో ప్రముఖ వ్యాపారి కోడలు ఆత్మహత్య
- సూసైడ్లో ఆత్మహత్య గల కారణాలు వెల్లడి
- దక్షిణాది హీరోయిన్ పేరు ప్రస్తావించిన బాధితురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్రముఖ వ్యాపారి కమల్ కిషోర్ కోడలు ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దీప్తి చౌరాసియా(40).. కమల పసంద్ యజమాని కమల్ కిషోర్ కోడలు. ఢిల్లీలోని వసంత్ విహార్లో నివాసం ఉంటారు. కమల్ కిషోర్ పాన్ మసాలా వ్యాపారం నిర్వహిస్తుంటారు. పాన్ మసాలా అనగానే చౌరాసియా కుటుంబం గుర్తుకొస్తుంది. అంతగా ఫేమస్. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ కమల పసంద్ యజమాని కోడలు దీప్తి చౌరాసియా ప్రాణాలు తీసుకుంది.
Also Read
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

2010లో కమల్ కిషోర్ కుమారుడు హర్ప్రీత్ చౌరాసియాతో దీప్తికి వివాహం అయింది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఇంట్లో దీప్తి ఉరివేసుకుంది. ఇక ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసింది. భర్తతో ఏర్పడిన వివాదం కారణంగానే ప్రాణాలు తీసుకుంటున్నట్లు ప్రస్తావించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
సూసైడ్ నోట్లో ఏముందంటే..
హర్ప్రీత్ రెండో వివాహం చేసుకున్నాడని దీప్తి ఆరోపించింది. ఇటీవలే దక్షిణ భారత్కు చెందిన ఒక సినీ హీరోయిన్ను పెళ్లి చేసుకున్నట్లు పేర్కొంది. భర్త రెండో పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కుటుంబంలో వివాదం చెలరేగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
పాన్ మసాలా..
చౌరాసియా కుటుంబం పాన్ మసాలా వ్యాపారంలో ప్రసిద్ధి చెందింది. కమల్ కిషోర్-అతని తండ్రి కమలా కాంత్ చౌరాసియా కలిసి కమలా పసంద్ బ్రాండ్ను స్థాపించారు. ఈ బ్రాండ్ కాన్పూర్, ఢిల్లీ, కోల్కతా, ముంబైలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కమలా కాంత్ దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం కాన్పూర్లో పాన్ మసాలాను అమ్మడం ప్రారంభించారు. అతి కొద్ది కాలంలోనే పురోగతి సాధించింది. ప్రస్తుతం కంపెనీ బిలియన్ల రూపాయల టర్నోవర్ నడుస్తోంది.
తాజావార్తలు
-
Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
-
Xiaomi TV FX Mini LED Series: షియోమి TV FX Mini LED సిరీస్ విడుదల.. Dolby Vision, Fire TV, 4K డిస్ప్లే
-
Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
-
Infinix Smart 20: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 రిలీజ్ డేట్ ఫిక్స్.. 5,200mAh బ్యాటరీ, ధర రూ. 10,000 లోపే..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!