Deepti Chaurasia: ఢిల్లీలో ప్రముఖ వ్యాపారి కోడలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే..!
- ఢిల్లీలో ప్రముఖ వ్యాపారి కోడలు ఆత్మహత్య
- సూసైడ్లో ఆత్మహత్య గల కారణాలు వెల్లడి
- దక్షిణాది హీరోయిన్ పేరు ప్రస్తావించిన బాధితురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్రముఖ వ్యాపారి కమల్ కిషోర్ కోడలు ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దీప్తి చౌరాసియా(40).. కమల పసంద్ యజమాని కమల్ కిషోర్ కోడలు. ఢిల్లీలోని వసంత్ విహార్లో నివాసం ఉంటారు. కమల్ కిషోర్ పాన్ మసాలా వ్యాపారం నిర్వహిస్తుంటారు. పాన్ మసాలా అనగానే చౌరాసియా కుటుంబం గుర్తుకొస్తుంది. అంతగా ఫేమస్. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ కమల పసంద్ యజమాని కోడలు దీప్తి చౌరాసియా ప్రాణాలు తీసుకుంది.
Also Read
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి

2010లో కమల్ కిషోర్ కుమారుడు హర్ప్రీత్ చౌరాసియాతో దీప్తికి వివాహం అయింది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఇంట్లో దీప్తి ఉరివేసుకుంది. ఇక ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసింది. భర్తతో ఏర్పడిన వివాదం కారణంగానే ప్రాణాలు తీసుకుంటున్నట్లు ప్రస్తావించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
సూసైడ్ నోట్లో ఏముందంటే..
హర్ప్రీత్ రెండో వివాహం చేసుకున్నాడని దీప్తి ఆరోపించింది. ఇటీవలే దక్షిణ భారత్కు చెందిన ఒక సినీ హీరోయిన్ను పెళ్లి చేసుకున్నట్లు పేర్కొంది. భర్త రెండో పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కుటుంబంలో వివాదం చెలరేగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
పాన్ మసాలా..
చౌరాసియా కుటుంబం పాన్ మసాలా వ్యాపారంలో ప్రసిద్ధి చెందింది. కమల్ కిషోర్-అతని తండ్రి కమలా కాంత్ చౌరాసియా కలిసి కమలా పసంద్ బ్రాండ్ను స్థాపించారు. ఈ బ్రాండ్ కాన్పూర్, ఢిల్లీ, కోల్కతా, ముంబైలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కమలా కాంత్ దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం కాన్పూర్లో పాన్ మసాలాను అమ్మడం ప్రారంభించారు. అతి కొద్ది కాలంలోనే పురోగతి సాధించింది. ప్రస్తుతం కంపెనీ బిలియన్ల రూపాయల టర్నోవర్ నడుస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?