కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఈ మధ్య తెలంగాణలో కేఏ పాల్పై దాడి జరిగిన విషయం తెలిసిందే కాగా.. ఢిల్లీ వెళ్లిన ఆయన ఈ వ్యవహారంపై కూడా ఫిర్యాదు చేసినట్టుగా చెబుతున్నారు. అమిత్షాతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన పాల్.. తెలంగాణలో జరుగుతున్న అవినీతి అన్యాయం అక్రమాలు నా జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు.. అమిత్ షాతో అనేక విషయాలను చర్చించాను.. కేసీఆర్ అవినీతి, కేటీఆర్ అక్రమాలు, కేసీఆర్ దాడులు ఇలా అన్నీ చర్చకు వచ్చాయన్నారు. ఇక, లక్షల కోట్లు మాయమయ్యాయి.. ఆంధ్రప్రదేశ్ అప్పు దాదాపు 8 లక్షల కోట్లు, తెలంగాణ అప్పు నాలుగున్నర లక్షల కోట్లకు చేరిందన్నారు..
Read Also: YS Jagan: వారికి గుడ్న్యూస్.. రేపే ఖాతాల్లోకి సొమ్ము
ఇక, తెలంగాణలో నా పైన జరిగిన దాడిని కేంద్రమంత్రులు అమిత్ షా, పురుషోత్తం రూపాల ఖండించారిన తెలిపారు కేఏ పాల్.. రెండో రోజుల్లో తెలంగాణకు వస్తున్న అని అమిత్ షా చెప్పారు, నాకు భరోసా ఇచ్చారన్న ఆయన.. దేశ ఆర్థిక పరిస్థితులపై అమిత్ షా తో మాట్లాడానని.. చైనా జీడీపీ, ఇండియా జీడీపీ 33 ఏళ్ల క్రితం ఒకేలా ఉండేవని, ఇప్పుడు చైనా జీడీపీ ఆరు రెట్లు మన దేశం కన్నా ఎక్కువగా ఉందన్నారు. మరోవైపు, ప్రజాశాంతి పార్టీ తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా పోటీ చేస్తుంది, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తోందన్నారు. తెలంగాణ డీజీపీ కలుస్తాను అంటే సమయం ఇవ్వలేదు. కానీ, కేంద్ర హోంమంత్రి అడగగానే సమయం ఇచ్చారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు నాకు ఇచ్చే గౌరవాన్ని మీరు చూడొచ్చు.. వారందరికీ వందనాలన్న పాల్.. తెలంగాణ ప్రజలకు ఒకటే చెబుతున్నాను… ఇక, కేసీఆర్, కేటీఆర్ అవినీతి చెల్లదని హెచ్చరించారు. నాపైన కేసీఆర్ దాడి చేయించారు అంటే దాని పరిణామాలు త్వరలో చూస్తారని వార్నింగ్ ఇచ్చారు కేఏ పాల్.