KA Paul: ట్రంప్ అరెస్ట్ అవుతాడని గతంలోనే చెప్పాను.. కేఏ పాల్ హాట్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul Controversial Comments On Donald Trump And CM KCR: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ కామెంట్స్తో వార్తల్లోకెక్కారు. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్ట్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. ట్రంప్ అరెస్ట్ అవుతాడని తాను గతంలోనే చెప్పానంటూ బాంబ్ పేల్చారు. ట్రంప్ మారాలని ఎన్నోసార్లు హెచ్చరించానని, కానీ అతడు వినిపించుకోలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ మీద కూడా తాను ఆరు కేసులు గెలిచానన్న ఆయన.. ఇంకా సీఎంపై కేసులున్నాయని, తాను ఓడిపోలేదని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తాను పగలనక రాత్రనక తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నానన్నారు. సిరిసిల్లలో తనపై దాడి చేసిన వారి మీద ఇప్పటివరకు అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనిల్ కుమార్ సైతం తనపై హత్యాయత్నం చేశారని, అతనిపై పోలీసులు ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
Clash: ‘బలగం’ సినిమా ప్రదర్శన వద్ద యువకుల ఘర్షణ.. ఓ వ్యక్తి దుర్మరణం
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
తెలంగాణలో తాను ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్నా అడ్డుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తనపై లేనిపోని కేసులు పెడుతోందని కేఏ పాల్ ఆరోపించారు. తనని చంపించాలని చాలామంది చూస్తున్నారంటూ కుండబద్దలు కొట్టారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ సెక్రటేరియట్ ఓపెన్ చేయాలని ఈ సందర్భంగా ఆయన కేసీఆర్కి డిమాండ్ చేశారు. చాలామంది బిలియనీర్లు హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ.. లక్షల కోట్లు అప్పు చేసి దేశాన్ని, రాష్ట్రాన్నీ శ్రీలంకలా తయారు చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల కోసం.. రైతులు, బడుగు బలహీన వర్గాల కోసం తాను ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజాశాంతి పార్టీని రెండు తెలుగు రాష్ట్రాలలో గెలిపించాలని ప్రజల్ని కోరారు. కేజ్రీవాల్ని ఢిల్లీలో, పంజాబ్లో ఎలా ఎన్నుకున్నారో.. తనని కూడా తెలుగు రాష్ట్రాల్లో అలాగే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్ని తానొక్కడే మార్చగలనని చెప్పుకొచ్చారు.
Nandini vs Amul: కర్ణాటకలో అమూల్ రగడ.. పాల ఉత్పత్తులను విసిరి నిరసన
ఇదిలావుండగా.. కేఏ పాల్కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఇటీవల తెలంగాణ నూతన సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సచివాలయంలో జరిగింది అగ్నిప్రమాదం కాదని, నరబలి అని కేఏ పాల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. తన కేసులో తానే స్వయంగా వాదనలు వినిపించారు. ఈ పిటిషిన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. అగ్నిప్రమాద ఘటనలపై జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పేసింది. అంతేకాదు.. దేశంలో జరిగే అగ్నిప్రమాదాలపై సీబీఐతో విచారణ జరపమని ఆదేశించాలా? అంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కేఏ పాల్ పిటిషన్ని తోసిపుచ్చింది.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!