Justice S Abdul Nazeer: సంస్కృత శ్లోకంతో వీడ్కోలు చెప్పిన జస్టిస్ అబ్దుల్ నజీర్.. అయోధ్య వివాదంపై తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justice Nazeer, part of Ayodhya verdict, ends farewell speech with this shloka: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ బుధవారం ప్రశంసించించింది. అబ్దుల్ నజీర్ పదవీ విరమణ రోజున సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమం ప్రసంగించారు. జస్టిస్ నజీర్ లౌకికవాదానికి నిజమైన స్వరూపం అని బార్ కౌన్సిల్ అధ్యక్షుడు వికాస్ సింగ్ ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జస్టిస్ నజీర్ న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిథ్యం తక్కువగా ఉండటాన్ని నొక్కి చెప్పారు. లింగ అసమానతల భారత న్యాయవ్యవస్థలో కూడా ఉందని ఆయన అన్నారు. సీజేఐ చంద్రచూడ్ మార్గదర్శకత్వంలో సుప్రీంకోర్టు ప్రస్తుత కాలంలోని అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. అభివృద్ధి, మార్పుకు ఎల్లప్పుడు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
Read Also: Revanth Reddy : పీసీసీ రాజీనామాకు నేను సిద్ధం
నేటితో జస్టిస్ అబ్దుల్ నజీర్ పదవీకాలం ముగిసింది. సుప్రీంకోర్ట బార్ కౌన్సిల్ లో జరిగిన వీడ్కోలు సమావేశంలో సంస్కృత శ్లోకంతో వీడ్కోలు చెప్పారు. ‘‘ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాద్ ధర్మం పరమం వదన్తి’’ అంటూ దాని అర్థాన్ని తెలియజేశారు. ప్రపంచంలోని ప్రతీదీ ధర్మంపై స్థాపించబడుతుంది. అందుకే ధర్మం అంతిమ సర్వోన్నతమైనదని.. ధన్యవాదాలు తెలుపుతూ.. జైహింద్ చెప్పారు.
ఫిబ్రవరి 17, 2017న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు జస్టిస్ నజీర్. రాజకీయంగా దేశంలో ఎంతో సున్నితమైన అయోధ్య భూ వివాదం, త్రిపుల్ తలాక్, గోప్యత హక్కు మొదలైన కేసుల్లో తీర్పులు ప్రకటించిన ధర్మాసనంలో భాగంగా ఉన్నారు. అయోధ్య వివాదంలో మెజారిటీ వర్గం మనోభావాలకు ప్రాధాన్యత ఇచ్చారు. నిజమైన లౌకికవాదిగా పేరు తెచ్చుకున్నారు. ముస్లిం మహిళల హక్కులను దెబ్బతీస్తున్న త్రిపుల్ తలాక్ ను విచారించిన రాజ్యాంగధర్మాసనంలో కూడా నజీర్ ఉన్నారు. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించిన తీర్పులో భాగంగా ఉన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!