Justice S Abdul Nazeer: సంస్కృత శ్లోకంతో వీడ్కోలు చెప్పిన జస్టిస్ అబ్దుల్ నజీర్.. అయోధ్య వివాదంపై తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justice Nazeer, part of Ayodhya verdict, ends farewell speech with this shloka: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ బుధవారం ప్రశంసించించింది. అబ్దుల్ నజీర్ పదవీ విరమణ రోజున సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమం ప్రసంగించారు. జస్టిస్ నజీర్ లౌకికవాదానికి నిజమైన స్వరూపం అని బార్ కౌన్సిల్ అధ్యక్షుడు వికాస్ సింగ్ ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జస్టిస్ నజీర్ న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిథ్యం తక్కువగా ఉండటాన్ని నొక్కి చెప్పారు. లింగ అసమానతల భారత న్యాయవ్యవస్థలో కూడా ఉందని ఆయన అన్నారు. సీజేఐ చంద్రచూడ్ మార్గదర్శకత్వంలో సుప్రీంకోర్టు ప్రస్తుత కాలంలోని అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. అభివృద్ధి, మార్పుకు ఎల్లప్పుడు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
Read Also: Revanth Reddy : పీసీసీ రాజీనామాకు నేను సిద్ధం
నేటితో జస్టిస్ అబ్దుల్ నజీర్ పదవీకాలం ముగిసింది. సుప్రీంకోర్ట బార్ కౌన్సిల్ లో జరిగిన వీడ్కోలు సమావేశంలో సంస్కృత శ్లోకంతో వీడ్కోలు చెప్పారు. ‘‘ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాద్ ధర్మం పరమం వదన్తి’’ అంటూ దాని అర్థాన్ని తెలియజేశారు. ప్రపంచంలోని ప్రతీదీ ధర్మంపై స్థాపించబడుతుంది. అందుకే ధర్మం అంతిమ సర్వోన్నతమైనదని.. ధన్యవాదాలు తెలుపుతూ.. జైహింద్ చెప్పారు.
ఫిబ్రవరి 17, 2017న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు జస్టిస్ నజీర్. రాజకీయంగా దేశంలో ఎంతో సున్నితమైన అయోధ్య భూ వివాదం, త్రిపుల్ తలాక్, గోప్యత హక్కు మొదలైన కేసుల్లో తీర్పులు ప్రకటించిన ధర్మాసనంలో భాగంగా ఉన్నారు. అయోధ్య వివాదంలో మెజారిటీ వర్గం మనోభావాలకు ప్రాధాన్యత ఇచ్చారు. నిజమైన లౌకికవాదిగా పేరు తెచ్చుకున్నారు. ముస్లిం మహిళల హక్కులను దెబ్బతీస్తున్న త్రిపుల్ తలాక్ ను విచారించిన రాజ్యాంగధర్మాసనంలో కూడా నజీర్ ఉన్నారు. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించిన తీర్పులో భాగంగా ఉన్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!