Justice S Abdul Nazeer: సంస్కృత శ్లోకంతో వీడ్కోలు చెప్పిన జస్టిస్ అబ్దుల్ నజీర్.. అయోధ్య వివాదంపై తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justice Nazeer, part of Ayodhya verdict, ends farewell speech with this shloka: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ బుధవారం ప్రశంసించించింది. అబ్దుల్ నజీర్ పదవీ విరమణ రోజున సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమం ప్రసంగించారు. జస్టిస్ నజీర్ లౌకికవాదానికి నిజమైన స్వరూపం అని బార్ కౌన్సిల్ అధ్యక్షుడు వికాస్ సింగ్ ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జస్టిస్ నజీర్ న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిథ్యం తక్కువగా ఉండటాన్ని నొక్కి చెప్పారు. లింగ అసమానతల భారత న్యాయవ్యవస్థలో కూడా ఉందని ఆయన అన్నారు. సీజేఐ చంద్రచూడ్ మార్గదర్శకత్వంలో సుప్రీంకోర్టు ప్రస్తుత కాలంలోని అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. అభివృద్ధి, మార్పుకు ఎల్లప్పుడు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
Read Also: Revanth Reddy : పీసీసీ రాజీనామాకు నేను సిద్ధం
నేటితో జస్టిస్ అబ్దుల్ నజీర్ పదవీకాలం ముగిసింది. సుప్రీంకోర్ట బార్ కౌన్సిల్ లో జరిగిన వీడ్కోలు సమావేశంలో సంస్కృత శ్లోకంతో వీడ్కోలు చెప్పారు. ‘‘ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాద్ ధర్మం పరమం వదన్తి’’ అంటూ దాని అర్థాన్ని తెలియజేశారు. ప్రపంచంలోని ప్రతీదీ ధర్మంపై స్థాపించబడుతుంది. అందుకే ధర్మం అంతిమ సర్వోన్నతమైనదని.. ధన్యవాదాలు తెలుపుతూ.. జైహింద్ చెప్పారు.
ఫిబ్రవరి 17, 2017న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు జస్టిస్ నజీర్. రాజకీయంగా దేశంలో ఎంతో సున్నితమైన అయోధ్య భూ వివాదం, త్రిపుల్ తలాక్, గోప్యత హక్కు మొదలైన కేసుల్లో తీర్పులు ప్రకటించిన ధర్మాసనంలో భాగంగా ఉన్నారు. అయోధ్య వివాదంలో మెజారిటీ వర్గం మనోభావాలకు ప్రాధాన్యత ఇచ్చారు. నిజమైన లౌకికవాదిగా పేరు తెచ్చుకున్నారు. ముస్లిం మహిళల హక్కులను దెబ్బతీస్తున్న త్రిపుల్ తలాక్ ను విచారించిన రాజ్యాంగధర్మాసనంలో కూడా నజీర్ ఉన్నారు. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించిన తీర్పులో భాగంగా ఉన్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!