Justice S Abdul Nazeer: సంస్కృత శ్లోకంతో వీడ్కోలు చెప్పిన జస్టిస్ అబ్దుల్ నజీర్.. అయోధ్య వివాదంపై తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justice Nazeer, part of Ayodhya verdict, ends farewell speech with this shloka: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ బుధవారం ప్రశంసించించింది. అబ్దుల్ నజీర్ పదవీ విరమణ రోజున సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమం ప్రసంగించారు. జస్టిస్ నజీర్ లౌకికవాదానికి నిజమైన స్వరూపం అని బార్ కౌన్సిల్ అధ్యక్షుడు వికాస్ సింగ్ ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జస్టిస్ నజీర్ న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిథ్యం తక్కువగా ఉండటాన్ని నొక్కి చెప్పారు. లింగ అసమానతల భారత న్యాయవ్యవస్థలో కూడా ఉందని ఆయన అన్నారు. సీజేఐ చంద్రచూడ్ మార్గదర్శకత్వంలో సుప్రీంకోర్టు ప్రస్తుత కాలంలోని అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. అభివృద్ధి, మార్పుకు ఎల్లప్పుడు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
Also Read
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
Read Also: Revanth Reddy : పీసీసీ రాజీనామాకు నేను సిద్ధం
నేటితో జస్టిస్ అబ్దుల్ నజీర్ పదవీకాలం ముగిసింది. సుప్రీంకోర్ట బార్ కౌన్సిల్ లో జరిగిన వీడ్కోలు సమావేశంలో సంస్కృత శ్లోకంతో వీడ్కోలు చెప్పారు. ‘‘ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాద్ ధర్మం పరమం వదన్తి’’ అంటూ దాని అర్థాన్ని తెలియజేశారు. ప్రపంచంలోని ప్రతీదీ ధర్మంపై స్థాపించబడుతుంది. అందుకే ధర్మం అంతిమ సర్వోన్నతమైనదని.. ధన్యవాదాలు తెలుపుతూ.. జైహింద్ చెప్పారు.
ఫిబ్రవరి 17, 2017న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు జస్టిస్ నజీర్. రాజకీయంగా దేశంలో ఎంతో సున్నితమైన అయోధ్య భూ వివాదం, త్రిపుల్ తలాక్, గోప్యత హక్కు మొదలైన కేసుల్లో తీర్పులు ప్రకటించిన ధర్మాసనంలో భాగంగా ఉన్నారు. అయోధ్య వివాదంలో మెజారిటీ వర్గం మనోభావాలకు ప్రాధాన్యత ఇచ్చారు. నిజమైన లౌకికవాదిగా పేరు తెచ్చుకున్నారు. ముస్లిం మహిళల హక్కులను దెబ్బతీస్తున్న త్రిపుల్ తలాక్ ను విచారించిన రాజ్యాంగధర్మాసనంలో కూడా నజీర్ ఉన్నారు. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించిన తీర్పులో భాగంగా ఉన్నారు.
తాజావార్తలు
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!