Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- జార్ఖండ్ విద్యార్ధి ఉద్యమానికి దిగొచ్చిన సర్కార్..
- 14వ JPSC పరీక్షను రద్దుకు సిద్ధం..
- సీబీఐ విచారణకు హామీ ఇవ్వాలని విద్యార్థుల అల్టిమేటం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand Protest: పేపర్ లీక్పై విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి జార్ఖండ్ సర్కార్ దిగొచ్చింది. ఆగస్టు 10న జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు పిలుపునిచ్చారు. ఆదివారం మరోసారి విద్యార్థులు, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. అయినప్పటికీ JPSC-JSSC పరీక్షల రద్దుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, సీబీఐ దర్యాప్తుపై హామీ ఇచ్చేంత వరకు రాజీ ప్రసక్తే లేదని విద్యార్థి నాయకులు తేల్చి చెప్పారు.
విద్యార్ధులతో జరిగిన చర్చల నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 14వ JPSC పరీక్షను రద్దు చేయడం, పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై దర్యాప్తు చేయడం, నియామక ప్రక్రియలో సంస్కరణలు తీసుకురావడం వంటి ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. అయితే, ఈ ప్రతిపాదనల్ని విద్యార్థులు పట్టించుకోవడం లేదు. సీబీఐ దర్యాప్తు లేకుండా చేసే ఇతర దర్యాప్తులు చేయడం, సీజీఎల్ పరీక్షను రద్దు చేయకపోవడం తమ ప్రధాన సమస్యల్ని పరిష్కరించవని విద్యార్థులు స్పష్టం చేశారు.
Also Read
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
- Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్పై చెప్పులతో దాడి.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత..
- NALSAR: "CJI సూర్యకాంత్ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోం".. నల్సార్ యూనివర్సిటీ వివాదం..
విద్యార్థులు చేస్తు్న్న డిమాండ్లలో 99 శాతం అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి సుదివ్య కుమార్ సోను తెలిపారు. మూడు రోజుల చర్చల తర్వాత 14వ JPSC పరీక్షతో పాటు 2023-25 బ్యాక్లాగ్ నియామకాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై రెండు దిశల్లో దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రిమినల్ అంశాలను రాష్ట్ర సీఐడీ దర్యాప్తు చేస్తుందని, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు కోరుతామని మంత్రి తెలిపారు. నిందితులపై 90 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. భవిష్యత్ నియామకాలపై నిపుణులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
-
AAA Cinemas : వైజాగ్లో బన్నీ కొత్త అడ్డా.. AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్.!
-
DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
-
Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!