Pooja Singhal: మనీలాండరింగ్ కేసు.. ఐఏఎస్ అధికారిణి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. మంగళవారం 9 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత .. పూజా సింఘాల్ బుధవారం మళ్లీ విచారణకు హాజరయ్యారు.. ఇక, ఆమెకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలను సేకరించిన ఈడీ.. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసింది.. కాగా పూజా సింఘాల్.. ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర గనులశాఖ కార్యదర్శిగా ఉన్నారు.. కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడటంతోపాటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నిధులను దారి మళ్లించారనే అభియోగాలున్నాయి.. దీంతో, రంగంలోకి దిగిన ఈడీ.. పూజా సింఘాల్ నివాసంతోపాటు ఆమె సన్నిహితుల ఇళ్లపై గత వారం ఏకకాలంలో దాడులు చేసింది.. కీలక ఆధారాలు సేకరించింది.
Read Also: Taj Mahal: మా స్థలంలోనే తాజ్ మహల్ కట్టారు..
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
అనుమానాస్పద నగదు లావాదేవీలు తనిఖీ చేసేందుకు గత మూడేళ్లుగా ఆమె లావాదేవీలను స్కాన్ చేస్తామని ఈడీ వర్గాలు తెలిపాయి. ఆమెకు గతంలో ఉన్న ఆస్తులు.. ఇప్పుడు ఉన్న అన్ని ఆస్తుల వివరాలను కూడా ఏజెన్సీ స్కాన్ చేస్తోంది. ఇక, ఈడీ జరిపిన దాడుల్లో దాదాపు రూ.19 కోట్ల నగదు లభించింది. అది సింఘాల్ డబ్బు అని చెబుతున్నారు. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ఈడీ దర్యాప్తు చేస్తోంది.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ఉదయం రాంచీ, చండీగఢ్, ముంబై, కోల్కతా, ముజఫర్పూర్, సహర్సాతో సహా 18 కంటే ఎక్కువ ప్రదేశాలలో ఫరీదాబాద్, గురుగ్రామ్, నోయిడాతో సహా ఎన్సీఆర్లోని అనేక ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఈ సమయంలో స్వాధీనం చేసుకున్న నగదును లెక్కించడానికి బ్యాంకు అధికారులు, కరెన్సీ లెక్కింపు యంత్రాల సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ఇక, ఆ తర్వాత సీఏ సుమన్ కుమార్ ను శనివారం అరెస్టు చేసింది ఈడీ.. సుమన్ కుమార్ను ఐదు రోజుల ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగిసింది.. పూజా సింఘాల్ 2007 నుంచి 2013 వరకు డిప్యూటీ కమిషనర్, జిల్లా మేజిస్ట్రేట్గా పనిచేసే సమయంలో ఆమె అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు కూడా ఈడీ అభియోగాలు మోపింది.
తాజావార్తలు
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!