Taj Mahal: మా స్థలంలోనే తాజ్ మహల్ కట్టారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజ్ మహల్ కట్టింది మా స్థలంలోనే అంటున్నారు బీజేపీ ఎంపీ దియా కుమారి.. దానికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెబుతున్నారు.. దీంతో, ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక్కటైనా తాజ్ మహల్.. మరోసారి వార్తల్లో నిలిచినట్టు అయ్యింది.. బీజేపీ ఎంపీ మరియు జైపూర్ మాజీ యువరాణి అయిన దియా కుమారి.. తాజ్ మహల్ నిర్మించిన భూమి వాస్తవానికి మా కుటుంబానికి చెందినదని పేర్కొన్నారు. జైపూర్ రాజకుటుంబం భూమిపై దావా వేసినట్లు తన వద్ద పత్రాలు ఉన్నాయని స్పష్టం చేశారు.. హిందూ విగ్రహాల ఉనికిని తనిఖీ చేయడానికి తాజ్ మహల్లోని 22 తాళం వేసిన గదులను పరిశీలించాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని కోరుతూ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్లో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దియా కుమారి ఈ వ్యాఖ్యలు చేసి చర్చకు తెరలేపారు.
పిటిషన్కు మద్దతుగా ఎంపీ దియా కుమారి మాట్లాడుతూ.. స్మారక చిహ్నం నిర్మించడానికి ముందు అక్కడ ఏమి ఉందో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ‘మక్బరా’కు ముందు అసలు ఏముందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్న ఆమె.. మా కుటుంబం వద్ద రికార్డులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే వీటిని అందజేస్తామని తెలిపారు. మొఘల్ పాలకుడు షాజహాన్ తన కుటుంబానికి చెందిన భూమిని స్వాధీనం చేసుకున్నాడన్న ఆమె.. ఆ కాలంలో న్యాయ వ్యవస్థ, అప్పీల్ చేసుకునే అవకాశం లేదనే విషయం అందరికీ తెలుసని. ఒకవేళ తమ దగ్గరున్న రికార్డులను పరిశీలిస్తే.. విషయం ఏంటో స్పష్టంగా తెలుస్తుందన్నారు.
Also Read
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
కాగా, తాజ్ మహల్ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ కోసం సమాధిగా నిర్మించాడు. 1631లో నిర్మాణాన్ని ప్రారంభించారు.. ఈ పాలరాతి స్మారక చిహ్నం నిర్మాణానికి 22 సంవత్సరాలు పట్టింది.. 22,000 మంది కార్మికులు 1653లో తాజ్ మహల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. అయితే, షాజహాన్ తన భార్య సమాధిగా మార్చుకున్న ప్రాంతంలో శివాలయం ఉండేదని కోర్టులో పిటిషన్ దాఖలైంది.. చాలా కాలంగా మూతపడిన తాజ్మహల్లోని 22 గదులను తెరిచేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వే చేయించాలని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు.. అయోధ్యలోని బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ రజనీష్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్లో, సమాధి నిజానికి పాత శివాలయం అని కొంతమంది చరిత్రకారులు, హిందూ సంఘాల వాదనలను ఉదహరించారు. తాళం వేసి ఉన్న గదులను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి నివేదికను ప్రజలకు అందించాలని ఏఎస్ఐని పిటిషన్లో కోరారు.
అయితే, తాజ్మహల్ను దేవాలయంగా మార్చడం కాదు.. కానీ, సామాజిక సామరస్యానికి సంబంధించిన వాస్తవాన్ని బయటకు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు రజనీష్ సింగ్.. ఇలాంటి వివాదాలకు తెరపడాలంటే మూసి ఉన్న తలుపులను పరిశీలించడం ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. తాజ్ మహల్ పై ఇప్పటికే వెలుగులో ఉన్న వివాదాల ప్రకారం.. 1965లో, చరిత్రకారుడు పీఎన్ ఓక్ తన పుస్తకంలో తాజ్ మహల్ నిజానికి ఒక శివాలయం అని పేర్కొన్నాడు. 2015లో తాజ్ మహల్ను ‘తేజోమహలే’గా ప్రకటించాలని ఆగ్రాలోని సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక, తాజ్ మహల్ను తేజోమహల్గా ప్రకటించాలని 2017లో బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కోరారు. ఇప్పుడు బీజేపీ ఎంపీ దియా కుమారి చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది తాజ్ మహల్.
తాజావార్తలు
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
-
Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!