Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
- దిగొచ్చిన హేమంత్ సర్కార్
- విద్యార్థుల డిమాండ్లకు గ్రీన్సిగ్నల్!
- సీబీఐ దర్యాప్తుపై వెనక్కి తగ్గని ఆందోళనకారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్లో ఉద్యోగ నియామక పరీక్షల విషయంలో విద్యార్థుల ఆందోళనకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్నోకు చెందిన టీడీపీఎల్ నిర్వహించిన అన్ని పరీక్షలు, నియామకాలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. అయితే విద్యార్థులు మాత్రం సీబీఐ దర్యాప్తు చేపట్టాలన్న తమ డిమాండ్పై వెనక్కి తగ్గడం లేదు. వారాలుగా జార్ఖండ్లో విద్యార్థులు పరీక్షలు, నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విద్యార్థులతో సమావేశమై పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు.
టీడీపీఎల్ నిర్వహించిన పరీక్షలు రద్దు
టీడీపీఎల్ నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలతో పాటు ఆ సంస్థ ద్వారా ఎంపికైన అభ్యర్థులు, పరీక్షల్లో పాల్గొన్న ప్రక్రియ, సంస్థ చేపట్టిన అన్ని కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు సోరెన్ తెలిపారు. “టీడీపీఎల్ ప్రచురించిన ఫలితాలు, ఆ సంస్థ ద్వారా ఎంపికైన అభ్యర్థులు లేదా పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థులకు సంబంధించిన ప్రక్రియ.. ఇక్కడ టీడీపీఎల్ చేపట్టిన అన్ని కార్యకలాపాలను రద్దు చేయాలి” అని సీఎం స్పష్టం చేశారు.
Also Read
- Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
- Twisha Sharma: సీబీఐ ఛార్జ్షీట్లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
- E20 Ethanol Demand: E20 తర్వాత అసలు సవాలు ఏంటి?.. ఆహారం, నీటిపై ఒత్తిడి తప్పదా?
- Modi-Fadnavis: మోడీతో మరోసారి ఫడ్నవిస్ భేటీ.. కేంద్ర కేబినెట్లోకి వెళ్లనున్నరా?
ఇదే సమయంలో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) నిర్వహించిన పరీక్షలు, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (JSSC CGL) పరీక్షలను కూడా రద్దు చేయనున్నట్లు హేమంత్ సోరెన్ వెల్లడించారు. పరీక్షలు, నియామకాలకు సంబంధించి విద్యార్థులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
2014 నుంచి జరిగిన పరీక్షలపై విచారణ
2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో చోటుచేసుకున్న తప్పిదాలపై విచారణ చేపడతామని సోరెన్ తెలిపారు. చిన్నదైనా, పెద్దదైనా జరిగిన ప్రతి తప్పును పరిశీలిస్తామని చెప్పారు. “2014 నుంచి జరిగిన చిన్నా పెద్దా అన్ని తప్పిదాలపై దర్యాప్తు చేస్తాం. 2014 నుంచి జార్ఖండ్లో జరిగిన అన్ని పరీక్షలను సీఐడీ విచారిస్తుంది” అని ముఖ్యమంత్రి విద్యార్థులకు తెలిపారు.
సంస్కరణల కోసం ప్రత్యేక కమిటీ
పరీక్షలు, నియామక వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కూడా హేమంత్ సోరెన్ ప్రకటించారు. ఐఏఎస్ అధికారి అమితాబ్ కౌశల్ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. అయితే ప్రభుత్వం పరీక్షల రద్దు, సీఐడీ దర్యాప్తునకు అంగీకరించినప్పటికీ.. సీబీఐతో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్పై విద్యార్థులు పట్టుదలగా ఉన్నారు. దీంతో జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళనకు ఇప్పటికీ పూర్తిగా తెరపడలేదు.
తాజావార్తలు
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
-
Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
One Ticket: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన TGSRTC.. ఒక్క టికెట్పైనే ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్లల్లో ప్రయాణం..
-
Allu Arjun: కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్లో హాజరైన అల్లు అర్జున్!
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!