Jharkhand: సీఎం హేమంత్ సోరెన్ సోదరుడిపై వేటు తప్పదా.. గవర్నర్కు అభిప్రాయం పంపిన ఈసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EC sends opinion to Governor on disqualification plea against Jharkhand CM’s brother: జార్ఖండ్ రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే సీఎం హేమంత్ సోరెన్పై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం గవర్నర్ రమేష్ బైస్ కు తన అభిప్రాయాన్ని తెలిపింది. దీంతో జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మాారాయి. ఇదిలా ఉంటే గవర్నర్ రమేష్ బైస్ ఇప్పటికీ సీఎం హేమంత్ సోరెన్ అనర్హత విషయాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్పై కూడా వేటు తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి.
Read Also: British Queen Elizabeth 2 : ప్రపంచంపై ప్రత్యేక ముద్ర వేసిన బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
ప్రజా ప్రతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 9ఏ ప్రకారం.. మైనింగ్ సంస్థకు సహ యజమానిగా ఉన్న ఎమ్మెల్యే బసంత్ సోరెన్పై అనర్హత వేటు వేసేందుకు గవర్నర్, ఈసీ అభిప్రాయాన్ని కోరారు. తాజాగా ఈసీ, గవర్నర్ కు తన అభిప్రాయాన్ని తెలియజేసింది. అయితే ఈసీ ఏలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందనేది ఇంకా తెలియరాలేదు. ప్రభుత్వ పదవుల్లో ఉండీ.. సీఎం హేమంత్ సొరెన్, బసంత్ సోరెన్లు తమకు తాము మైనింగ్ లీజులు ఇచ్చుకోవడం వివాదాస్పదం అయింది. అక్రమ పద్ధతుల్లో మైనింగ్ లీజులు పొందారని జార్ఖండ్ బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రజాప్రతినిథ్య చట్టం ప్రకారం సీఎం హేమంత్ సొరెన్ పై అనర్హత వేటు పడింది.
ఇదిలా ఉంటే గవర్నర్, సీఎం హేమంత్ సోరెన్ పై అనర్హత వేటును అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అయితే జార్ఖండ్ ముక్తీ మోర్చా(జేఎంఎం) ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకే ఇలా చేస్తున్నారంటూ.. ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో జేఎంఎంతో అధికారం పంచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను చత్తీస్గఢ్ తరలించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తుందని జేఎంఎం, కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నాయి.
తాజావార్తలు
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!