Jharkhand: సీఎం హేమంత్ సోరెన్ సోదరుడిపై వేటు తప్పదా.. గవర్నర్కు అభిప్రాయం పంపిన ఈసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EC sends opinion to Governor on disqualification plea against Jharkhand CM’s brother: జార్ఖండ్ రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే సీఎం హేమంత్ సోరెన్పై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం గవర్నర్ రమేష్ బైస్ కు తన అభిప్రాయాన్ని తెలిపింది. దీంతో జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మాారాయి. ఇదిలా ఉంటే గవర్నర్ రమేష్ బైస్ ఇప్పటికీ సీఎం హేమంత్ సోరెన్ అనర్హత విషయాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్పై కూడా వేటు తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి.
Read Also: British Queen Elizabeth 2 : ప్రపంచంపై ప్రత్యేక ముద్ర వేసిన బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2
Also Read
- Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
ప్రజా ప్రతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 9ఏ ప్రకారం.. మైనింగ్ సంస్థకు సహ యజమానిగా ఉన్న ఎమ్మెల్యే బసంత్ సోరెన్పై అనర్హత వేటు వేసేందుకు గవర్నర్, ఈసీ అభిప్రాయాన్ని కోరారు. తాజాగా ఈసీ, గవర్నర్ కు తన అభిప్రాయాన్ని తెలియజేసింది. అయితే ఈసీ ఏలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందనేది ఇంకా తెలియరాలేదు. ప్రభుత్వ పదవుల్లో ఉండీ.. సీఎం హేమంత్ సొరెన్, బసంత్ సోరెన్లు తమకు తాము మైనింగ్ లీజులు ఇచ్చుకోవడం వివాదాస్పదం అయింది. అక్రమ పద్ధతుల్లో మైనింగ్ లీజులు పొందారని జార్ఖండ్ బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రజాప్రతినిథ్య చట్టం ప్రకారం సీఎం హేమంత్ సొరెన్ పై అనర్హత వేటు పడింది.
ఇదిలా ఉంటే గవర్నర్, సీఎం హేమంత్ సోరెన్ పై అనర్హత వేటును అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అయితే జార్ఖండ్ ముక్తీ మోర్చా(జేఎంఎం) ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకే ఇలా చేస్తున్నారంటూ.. ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో జేఎంఎంతో అధికారం పంచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను చత్తీస్గఢ్ తరలించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తుందని జేఎంఎం, కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్పోన్ అవుతుందా?
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!