CBI: అక్రమాస్తుల కేసు.. కాంగ్రెస్ నేతకు మూడేళ్ల జైలు..
అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా డబ్బులు వెనుకేసిన రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు.. ఒక్కరేంటి.. చిన్ననుంచి పెద్ద వరకు ఎంతో మందిపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.. అయితే, కొందరు మాత్రం అడ్డంగా బుక్కైన సందర్భాలు ఉన్నాయి.. ఇక, ఎప్పుడో చేసిన తప్పులు.. ఏళ్ల తరబడి వెంటాడి నేతలు కూడా ఉన్నారు.. తాజాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జార్ఖండ్ విద్యాశాఖ మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు తిర్కీకి మూడేళ్ల జైలు శిక్ష విధించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల జరిమానా కూడా విధించింది.
Read Also: Flight: ఢిల్లీలో కరెంట్ పోల్ను ఢీకొట్టిన విమానం..
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
2005-2009 మధ్యకాలంలో మధు కోడా ప్రభుత్వంలో తిర్కీ మంత్రిగా పనిచేసిన సమయంలో రూ.6,28,698 అక్రమంగా సంపాదించినట్టు ఆరోపణలు వచ్చాయి.. సామాజిక కార్యకర్త రాజీవ్ శర్మ 2009లో దిగువ కోర్టులో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయగా.. ట్రయల్స్ కోర్టు జూలై 1, 2009న విచారణకు ఆదేశించింది. 1 ఆగస్టు 2010లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బంధు తిర్కీపై కేసు నమోదు చేసింది సీబీఐ. మందార్ ఎమ్మెల్యేగా 2005 నుంచి జూన్ 2009 వరకు రూ.6.28లక్షలు ఆదాయానికి మించి సంపాదించినట్లు తన విచారణలో సీబీఐ తేల్చింది.. ఇక, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణకు 21 మంది సాక్షులు, డిఫెన్స్ తరఫున ఎనిమిది సాక్షులను హాజరుపరిచారు.. ఇక, ఇవాళ తిర్కీకి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.. కోర్టు ఆదేశాలపై 62 ఏళ్ల మందార్ ఎమ్మెల్యేను ప్రశ్నించగా.. “నేను కోర్టును విశ్వసిస్తున్నాను.. నేను నా లాయర్తో మాట్లాడతాను” అని పేర్కొన్నారు.. కాగా, ఇదే కేసులో 2018లో రాంచీ జిల్లాలోని బన్హోరాలో బంధు తిర్కీని సీబీఐ అరెస్ట్ చేసింది.. ఆ తర్వాత ఆయనకు బెయిల్ లభించింది. ఇక, ఎన్నికల అఫిడవిట్లో బంధుత్ తిర్కీ తన ఆస్తులను రూ.60,000 నగదు, కారు చూపించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లు నివేదికలు తెలిపాయి. అయితే ఆయన మంత్రిగా ఉన్న సమయంలో న్యూఢిల్లీలోని వసంత్ విహార్లో రూ.8 కోట్ల విలువైన ఫ్లాట్ను కొనుగోలు చేశారు. మరోవైపు, జార్ఖండ్ నేతకు వివాదాలు కొత్తేమీ కాదు.. ఇప్పటికే పలు కుంభకోణాలు వెలుగుచూశాయి.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!