HD Kumaraswamy: కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలు విడుదలయ్యే తేదీ మే 13పై ఉంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ విజయాలు ఎలా ఉండబోతున్నాయనే విషయం ఆ రోజే తేలనుంది. ఇదిలా ఉంటే ప్రతీ పార్టీ నాయకుడు కూడా తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జేడీయూ పార్టీ నేత హెచ్డీ కుమారస్వామి మాట్లాడుతూ.. ఈ సారి కింగ్ మేకర్ కాదు కింగ్ కాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ చెబుతున్న దానికన్నా మెరుగైన స్థానాలను సాధించనున్నట్లు వెల్లడించారు.
Read Also: 7000-Year-Old Road: మధ్యదరా సముద్రం కింద బయటపడిన 7000 ఏళ్ల నాటి రోడ్డు
ఆర్థిక కారణాల వల్ల తాము గెలిచే అవకాశాలు ఉన్న 25 స్థానాల్లో ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నట్లు కుమారస్వామి అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ పార్టీ సంఖ్యాపరంగా మంచి స్థానాలను గెలుచుకుంటుదని అన్నారు. నా అభ్యర్థులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వలేకపోవడం బాధగా ఉందని, గెలిచే అభ్యర్థులు ఉన్న చిక్ బళ్లాపూర, దొడ్డ బళ్లాపుర మాదిరిగానే చివరి నిమిషంలో ఆర్థికంగా వారిని ఆదుకోవడంలో విఫలం అయ్యానని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు.
హంగ్ అసెంబ్లీపై కుమారస్వామి మాట్లాడుతూ.. మాకు 120 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని అన్నారు. హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు జేడీఎస్ పాత్ర గురించి చర్చిస్తానని తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాల్లో జేడీఎస్ 37 సీట్లను గెలుచుకుంది.