Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ లో ఆత్మాహుతి దాడి.. ఉరీ తరహా దాడికి యత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorist Suicide Attack On An Army Company Operating Base: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆర్మీ క్యాంపు లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించాలని అనుకున్నారు. అయితే వీరి ప్రయత్నాన్ని భద్రతా బలగాలు అడ్డగించాయి. గతంలో ఉరీ తరహా దాడికి ప్రయత్నించేందుకు ఉగ్రవాదులు విఫలయత్నం చేశారు. రాజౌరీలోని దర్హాల్ ప్రాంతంలోని పర్గల్ వద్ద ఆర్మీ క్యాంపు కంచెను దాటేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఘటన జరిగిన ప్రదేశం దర్హాల్ పోలీస్ స్టేషన్ కు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజౌరీ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మీ కంపెనీ స్థావరంపై ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు ఉగ్రవాదులు. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా.. ముగ్గురు జవాన్లు వీర మరణం పొందారు.
75వ స్వాతంత్య్ర వేడుకలకు కొన్ని రోజుల ముందు భారీ దాడి చేసేందుకు ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసింది ఆర్మీ. పర్గల్ ఆర్మీ క్యాంపులోకి ప్రవేశించిన ఆత్మాహుతి బాంబర్లు తమను తాము పేల్చేసుకుని చనిపోయారు. ఉగ్రవాదులు, ఆర్మీకి మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందగా.. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఆర్మీ క్యాంపుకు మరిన్ని బలగాలను పంపారు. సరిహద్దుల్లోని ప్రాంతాలను ఆర్మీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తోంది.
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
Read Also: India-China: చైనా వక్రబుద్ధి.. భారత్ ప్రతిపాదనపై జాప్యం
2016లో ఇలాగే జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాదులు సైనికులుగా దుస్తులు వేసుకుని ఉరీలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో క్యాంపు కంచెను కత్తిరించి ఉగ్రవాదులు క్యాంపులోకి ప్రవేశించారు. ఈ ఘటనలో 19 మంది వీర జవాన్లు మరణించారు. ఈ ఘటన అనంతరం ఇండియా పాక్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్టైక్స్ జరిపాయి.
ఇదిలా ఉంటే నిన్న కాశ్మీర్ లోని బుద్గామ్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. బుధవారం తెల్లవారుజామున ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో చుట్టుముట్టిన భద్రతా బలగాలు వారిని హతమార్చాయి. ఈ ఎన్ కౌంటర్ లో కీలక ఉగ్రవాది.. గతంలో కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్, అమ్రీన్ భట్ ను చంపిన ఉగ్రవాది లతీఫ్ రాథర్ అకా అబ్దుల్లా కూడా ఉన్నాడు.
J&K | Two terrorists, who carried out a suicide attack on an Army company operating base 25 kms from Rajouri, killed; three soldiers lost their lives. Operations in progress.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/QspNSFhfX6
— ANI (@ANI) August 11, 2022
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..