Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ లో ఆత్మాహుతి దాడి.. ఉరీ తరహా దాడికి యత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorist Suicide Attack On An Army Company Operating Base: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆర్మీ క్యాంపు లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించాలని అనుకున్నారు. అయితే వీరి ప్రయత్నాన్ని భద్రతా బలగాలు అడ్డగించాయి. గతంలో ఉరీ తరహా దాడికి ప్రయత్నించేందుకు ఉగ్రవాదులు విఫలయత్నం చేశారు. రాజౌరీలోని దర్హాల్ ప్రాంతంలోని పర్గల్ వద్ద ఆర్మీ క్యాంపు కంచెను దాటేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఘటన జరిగిన ప్రదేశం దర్హాల్ పోలీస్ స్టేషన్ కు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజౌరీ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మీ కంపెనీ స్థావరంపై ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు ఉగ్రవాదులు. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా.. ముగ్గురు జవాన్లు వీర మరణం పొందారు.
75వ స్వాతంత్య్ర వేడుకలకు కొన్ని రోజుల ముందు భారీ దాడి చేసేందుకు ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసింది ఆర్మీ. పర్గల్ ఆర్మీ క్యాంపులోకి ప్రవేశించిన ఆత్మాహుతి బాంబర్లు తమను తాము పేల్చేసుకుని చనిపోయారు. ఉగ్రవాదులు, ఆర్మీకి మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందగా.. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఆర్మీ క్యాంపుకు మరిన్ని బలగాలను పంపారు. సరిహద్దుల్లోని ప్రాంతాలను ఆర్మీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తోంది.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలో పాల్గొన్న శరద్ పవార్, సుప్రియా సూలే
- IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
- CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
- Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
Read Also: India-China: చైనా వక్రబుద్ధి.. భారత్ ప్రతిపాదనపై జాప్యం
2016లో ఇలాగే జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాదులు సైనికులుగా దుస్తులు వేసుకుని ఉరీలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో క్యాంపు కంచెను కత్తిరించి ఉగ్రవాదులు క్యాంపులోకి ప్రవేశించారు. ఈ ఘటనలో 19 మంది వీర జవాన్లు మరణించారు. ఈ ఘటన అనంతరం ఇండియా పాక్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్టైక్స్ జరిపాయి.
ఇదిలా ఉంటే నిన్న కాశ్మీర్ లోని బుద్గామ్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. బుధవారం తెల్లవారుజామున ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో చుట్టుముట్టిన భద్రతా బలగాలు వారిని హతమార్చాయి. ఈ ఎన్ కౌంటర్ లో కీలక ఉగ్రవాది.. గతంలో కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్, అమ్రీన్ భట్ ను చంపిన ఉగ్రవాది లతీఫ్ రాథర్ అకా అబ్దుల్లా కూడా ఉన్నాడు.
J&K | Two terrorists, who carried out a suicide attack on an Army company operating base 25 kms from Rajouri, killed; three soldiers lost their lives. Operations in progress.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/QspNSFhfX6
— ANI (@ANI) August 11, 2022
తాజావార్తలు
-
Hi: ఆగస్టు 14న కవిన్తో కలిసి ‘హాయ్’ అంటూ నయనతార హంగామా
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
CJP Protest: సీజేపీ నిరసనలో పాల్గొన్న శరద్ పవార్, సుప్రియా సూలే
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
-
IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!