Jammu Kashmir: కాశ్మీర్ లో ఉగ్రవాదుల దుశ్చర్య.. వలస కూలీ దారుణహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Migrant Labourer From Bihar Shot Dead By Terrorists: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. వలస కూలీ, హిందువులను, స్థానికేతరులను టార్గెట్ చేస్తూ టెర్రరిస్టులు ఇటీవల దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మరోసారి ఇదే విధంగా వలస కూలీని కాల్చి చంపారు. బీహార్ మాదేపురాకు చెందిన వలస కూలీ మహ్మద్ అమ్రేజ్ ను టెర్రరిస్టులు కాల్చిచంపారు. ఈ ఘటన బందిపోరా జిల్లాలోని సోద్నారా సుంబల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. గురువారం అర్థరాత్రి తర్వాత టెర్రిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఈ సమయంలో మహ్మద్ అమ్రేజ్ పై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో బాధితుడు మరణించాడు.
Read Also: Karnataka: ఇరు వర్గాల మధ్య చిచ్చురాజేసిన ప్రేమ వ్యవహారం.. ఇద్దరు మృతి
Also Read
- PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
అంతకు ముందు రోజు రాజౌరి జిల్లాలో ఆర్మీ క్యాంపుపై దాడి చేయడానికి ప్రయత్నించారు టెర్రరిస్టులు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. 2016 ఉరీ తరహా ఘటన చేసేందుకు మరోసారి టెర్రరిస్టులు ప్లాన్ చేశారు. అయితే భద్రతా బలగాల ఎదురుదాడిలో టెర్రరిస్టులు చనిపోయారు. స్వాతంత్య్ర వేడుకలకు ముందు దేశంలో విధ్వంసం సృష్టించాలని ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. బుధవారం బుద్గామ్ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి భద్రతా బలగాలు. గతంలో హిందూ పండిట్ రాహుల్ భట్ , కాశ్మీర్ టీవీ యాక్టర్ అమ్రీన్ భట్ ను కాల్చి చంపారు దుండగులు. ఈ హత్యలతో ప్రమేయం ఉన్న కీలక ఉగ్రవాదిని బుద్గామ్ ఎన్ కౌంటర్ లో హతమర్చాయి.
ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు హైబ్రీడ్ టెర్రరిజానికి పాల్పడుతున్నారు. సులువుగా లక్ష్యం అయ్యే వలస కూలీలు, హిందువులను టార్గెట్ చేస్తూ చంపుతున్నారు. లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద గ్రూప్ తో పాటు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఎన్ కౌంటర్లలో తొలగిస్తున్నాయి.
తాజావార్తలు
-
Guru Purnima 2026: గురు పౌర్ణమి జూలై 28నా? 29నా? సరైన తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం ఇదే
-
Jananayagan : విజయ్ ‘జననాయకుడు’ ఓవర్సీస్ రివ్యూ.. వద్దు బ్రో
-
Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి