Godavari-Cauvery: నదుల అనుసంధానం.. ఐదు రాష్ట్రాలతో కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం… ఢిల్లీలో రేపు మధ్యహ్నం 2 గంటలకు గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై 5 రాష్ట్రాలతో కేంద్రం సమావేశం నిర్వహించనుంది… కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ నేతృత్వంలో జరగనున్న ఈ కీలక భేటీకి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటక రాష్ట్రాల కారదర్శులు హాజరుకాబోతున్నారు.. ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల అభిప్రాయాలు, ఆలోచనలు తీసుకోనుంది సర్కార్.
కాగా, ఇప్పటికే సుమారు 75 వేల కోట్ల రూపాయల వ్యయ అంచనాతో “డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్” ను రూపొందించిన జాతీయ జల అభివృద్ధి సంస్థ (నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఎజెన్సీ).. వృథాగా పోతున్న 247 టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలన్నదే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా ఉంది… అయితే, మొత్తం ఖర్చులో 90 శాతం కేంద్రం, 10 శాతం ఖర్చు ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంది… తెలంగాణ సుమారు 80 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ సుమారు 90 టీఎంసీలు, పుదుచ్చేరి 5 టీఎంసీలు, తమిళనాడు సుమారు 45 టీఎంసీలు, కర్నాటక సుమారు 25 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది.. మొత్తంగా ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇక, రేపటి సమావేశంలో ఎలాంటి చర్చ సాగనుంది.. ఆయా రాష్ట్రాలు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయనున్నాయి.. వాటికి అనుగుణంగా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
- Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
తాజావార్తలు
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్ఫైర్, నో మిస్ఫైర్..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!