Rajasthan: రాజస్థాన్లో ఘోర బస్సు ప్రమాదం.. 19 మంది సజీవ దహనం..
- రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం..
- బస్సుకు నిప్పంటుకుని 15 మంది సజీవ దహనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు, నలుగురు మహిళలతో సహా 19 మంది సజీవ దహనమయ్యారని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
Read Also: Mohammed Shami: నేను రంజీలు ఆడగలిగితే.. వన్డేలు ఎందుకు ఆడొద్దు?.. సెలెక్టర్లపై మహ్మద్ షమీ విమర్శలు
Also Read
- Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
- Abhishek Banerjee: "నా గొంతు కోసినా సరే, మీకు లొంగేది లేదు".. చిక్కుల్లో మమత మేనల్లుడు
- Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
- DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
సమాచారం ప్రకారం, జైసల్మేర్-జోధ్పూర్ హైవేలోని థాయత్ గ్రామం సమీపంలో మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు ఉన్నారు. జైసల్మేర్ ప్రయాణం మొదలైన తర్వాత దాదాపు 20 కి.మీ దూరంలో బస్సు వెనక నుంచి అకస్మాత్తుగా పొగలు రావడం ప్రారంభమైంది. డ్రైవర్, ప్రయాణికులు స్పందించే లోపే మంటలు మొత్తం బస్సును చుట్టుముట్టాయి.
ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సు అద్దాలను పగటగొట్టి బయటకు దూకారు. చాలా మంది ప్రయాణికులు బ్యాగులు, వస్తువులు కాలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక గ్రామస్తులు సహాయకచర్యల్ని ప్రారంభించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాదానికి కారణాలను పరిశీలిస్తున్నారు. బస్సు ఇంజన్, లేదా వైరింగ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
గాయపడిన వారికి తక్షణ వైద్య సాయం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతాప్ సింగ్ అధికారుల్ని ఆదేశించారు. గవర్నర్ హరిభావు బగాడే, ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాథోడ్ , ఇతర నాయకులు ఈ విషాద సంఘటనపై విచారం వ్యక్తం చేశారు.
#WATCH | Rajasthan: A Jaisalmer-Jodhpur bus burst into flames in Jaisalmer. Fire tenders and Police present at the spot. pic.twitter.com/8vcxx5ID1q
— ANI (@ANI) October 14, 2025
తాజావార్తలు
-
Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
-
Best Budget Cars: టాటా నుంచి సిట్రోయెన్ వరకు.. 360-డిగ్రీ కెమెరాతో వచ్చే చౌకైన కార్లు ఇవే.. ధరలు రూ.6.99 లక్షల నుంచే!
-
Harappa Facts: ‘ఆ ముద్రపై కనిపిస్తున్న వ్యక్తి శివుడు కాదు..?’ అమెరికన్ చరిత్రకారిణి వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం!
-
Mumbai Indians: ఆటగాళ్లకు ముంబై మేనేజ్మెంట్ లాస్ట్ వార్నింగ్.. ఫ్రాంచైజీతో ఆడుకుంటే ఇకపై తరిమి కొట్టడమే..
-
Save The Tigers Season 3: ఆ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’.. ‘సేవ్ ది టైగర్స్ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..