Rajasthan: రాజస్థాన్లో ఘోర బస్సు ప్రమాదం.. 19 మంది సజీవ దహనం..
- రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం..
- బస్సుకు నిప్పంటుకుని 15 మంది సజీవ దహనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు, నలుగురు మహిళలతో సహా 19 మంది సజీవ దహనమయ్యారని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
Read Also: Mohammed Shami: నేను రంజీలు ఆడగలిగితే.. వన్డేలు ఎందుకు ఆడొద్దు?.. సెలెక్టర్లపై మహ్మద్ షమీ విమర్శలు
Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
సమాచారం ప్రకారం, జైసల్మేర్-జోధ్పూర్ హైవేలోని థాయత్ గ్రామం సమీపంలో మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు ఉన్నారు. జైసల్మేర్ ప్రయాణం మొదలైన తర్వాత దాదాపు 20 కి.మీ దూరంలో బస్సు వెనక నుంచి అకస్మాత్తుగా పొగలు రావడం ప్రారంభమైంది. డ్రైవర్, ప్రయాణికులు స్పందించే లోపే మంటలు మొత్తం బస్సును చుట్టుముట్టాయి.
ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సు అద్దాలను పగటగొట్టి బయటకు దూకారు. చాలా మంది ప్రయాణికులు బ్యాగులు, వస్తువులు కాలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక గ్రామస్తులు సహాయకచర్యల్ని ప్రారంభించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాదానికి కారణాలను పరిశీలిస్తున్నారు. బస్సు ఇంజన్, లేదా వైరింగ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
గాయపడిన వారికి తక్షణ వైద్య సాయం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతాప్ సింగ్ అధికారుల్ని ఆదేశించారు. గవర్నర్ హరిభావు బగాడే, ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాథోడ్ , ఇతర నాయకులు ఈ విషాద సంఘటనపై విచారం వ్యక్తం చేశారు.
#WATCH | Rajasthan: A Jaisalmer-Jodhpur bus burst into flames in Jaisalmer. Fire tenders and Police present at the spot. pic.twitter.com/8vcxx5ID1q
— ANI (@ANI) October 14, 2025
తాజావార్తలు
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
-
Ram Charan : హైదరాబాద్ శివార్లలో రామ్ చరణ్ లగ్జరీ ఫామ్హౌస్.. త్వరలోనే గృహప్రవేశం
ట్రెండింగ్
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!