Jagdeep Dhankhar: ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దు.. ఈడీ రైడ్స్పై హితవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagdeep Dhankhar says baseless remarks to have results: ఈడీ రైడ్స్పై తగిన ఆధారాలు లేకుండా సభలో ఆరోపణలు చేయొద్దని, అలాంటి ఆరోపణలు సభా హక్కుల్ని ఉల్లంఘించడంతో సమానమని.. రాజ్యసభ సభ్యులకు చైర్మన్ జగదీప్ ధన్కర్ హితవు పలికారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని రాజ్యసభలో సోమవారం జీరో అవర్లో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. ధన్కర్ ఆ విధంగా రియాక్ట్ అయ్యారు. ‘‘సభలో ఎవరేం మాట్లాడినా, అది కచ్ఛితత్వంతో కూడినది అయ్యుండాలి. తగిన ఆధారాలతోనే మాట్లాడాలి. ఆధారాలు లేని గణాంకాల్ని సభలో చెప్తామంటే.. అనుమతించే ప్రసక్తే లేదు. ఇష్టానుసారంగా తోచింది మాట్లాడితే, సభా హక్కుల్ని ఉల్లంఘించడంతో సమానం అవుతుంది. పత్రికల్లో వచ్చిన రిపోర్టులు లేదా ఎవరో వెల్లడించిన అభిప్రాయాలకు ప్రాముఖ్యం ఇవ్వబోము. సభలో ఏదైనా ఆరోపణ చేస్తే.. అందుకు చట్టబద్ధ డాక్యుమెంటేషన్ ఉండాలి’’ అంటూ ఆయన ఉద్ఘాటించారు.
Hydershahkote Black Magic: హైదర్ షాకోట్ స్కూల్ లో క్షుద్ర పూజల కలకలం..
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
అంతకుముందు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను వేధిస్తోందని మండిపడ్డారు. గత ఎనిమిదేళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా 3,000 సోదాలు నిర్వహించిందని.. కానీ, కేవలం 23 మందిని మాత్రమే దోషులుగా తేల్చిందని అన్నారు. ‘‘ఈడీ కేవలం ప్రతిపక్ష నేతలపైనే ఎందుకు సోదాలు నిర్వహిస్తోంది? 20 వేల కోట్ల మోసానికి పాల్పడ్డ నిరవ్ మోడీపై ఎందుకు మౌనం పాటిస్తోంది? నిరవ్ మోడీ, విజయ్ మాల్యా, లలిత్ మోడీ, వ్యాపమ్ స్కామ్లోని నేరస్తులపై ఎందుకు ఈడీ, సీబీఐ చర్యలు తీసుకోవడం లేదు? బీజేపీలో ఉన్న అవినీతి అధికారులపై ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు?’’ అంటూ సంజయ్ సింగ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఆయన ఇల్లీగల్ మైనింగ్లో ఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రెడ్డి బ్రదర్స్తో పాటు కర్ణాటకకు చెందిన పలువురు బీజేపీ నేతల పేర్లను సైతం తెరమీదకి తెచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఎన్డీయే ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సభాపతిని కలుగజేసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఆయన పైవిధంగా స్పందించారు.
Andhra Pradesh: ఓడీ దాటుతున్నారు జాగ్రత్త.. ఏపీ సర్కారుకు RBI హెచ్చరిక
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!