Israel: గాజా ప్రజల పైకి ఇజ్రాయిల్ ఓపెన్ ఫైర్..30 మంది మృతి, 115 మందికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel:గాజాలో ఇజ్రాయిల్ విధ్వంసం సృష్టిస్తోంది. దక్షిణ గాజాలోని రఫాలో యూఎస్ నిధులతో నడిచే ఒక సహాయక పంపిణీ కేంద్రం సమీపంలో ఇజ్రాయిల్ దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 30 మంది పాలస్తీనియన్లు మరణించారు. 115 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం వేలాది మంది పాలస్తీనియన్లు సహాయక కేంద్రం వద్ద గుమిగూడినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఇజ్రాయిల్ ట్యాంకులు జనంపైకి కాల్పులు జరిపినట్లు పాలస్తీనా జర్నలిస్టులు చెబుతున్నారు.
మృతులను, గాయపడిన వారిని గాడిద బండ్లపై సంఘటనా స్థలం నుంచి తరలించారు. ఈ సంఘటనపై హమాస్ స్పందించింది. మానవతా సాయం కోసం పంపిణీ కేంద్రాల వద్ద ఆకలితో గుమిగూడిన పౌరులను ఇజ్రాయిల్ ఊచకోత కోసిందని హమాస్ ఆరోపించింది. అవి “మానవతా సహాయ కేంద్రాలు కాదు, సామూహిక మరణ ఉచ్చులు” అని పిలిచింది.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
Read Also: Sharmishta Panoli: శర్మిష్ట పనోలి ఎవరు.? మమతా సర్కార్ ఎందుకు అరెస్ట్ చేసింది..
తాజాగా అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణకు హమాస్ తన నిర్ణయాన్ని వెల్లడించిన గంటల్లోనే ఈ సంఘటన జరిగింది. యుద్ధంతో దెబ్బతిన్న గాజాలో మానవతా సంక్షోభంపై ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. మార్చిలో కాల్పుల విరమణ ఒప్పందం రద్దు అయినప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా వ్యాప్తంగా దాడులను విస్తృతం చేసింది. పూర్తిగా గాజాను ఇజ్రాయిల్ దిగ్బంధించింది.
హమాస్ అక్టోబర్ 7, 2023న దాడి సమయంలో 251 మంది బందీలుగా పట్టుకుంది. వీరిలో 57 మంది గాజాలోనే ఉన్నారు, ఇందులో 34 మంది మరణించారని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. మార్చి 18న ఇజ్రాయెల్ తన దాడిని తిరిగి ప్రారంభించినప్పటి నుండి ఈ ప్రాంతంలో కనీసం 4,117 మంది మరణించారని, యుద్ధంలో మొత్తం మృతుల సంఖ్య 54,381కి చేరుకుందని, వీరిలో ఎక్కువ మంది పౌరులేనని హమాస్ ఆధీనంలో ఉన్న గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. అక్టోబర్ 07 నాటి హమాస్ దాడిలో 1,218 మంది మరణించారు, వీరిలో ఎక్కువ మంది పౌరులు ఉన్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!