Stock Market Crash: బడ్జెట్ షాక్ తో కుప్పకూలిన స్టాక్ట్ మార్కెట్.. ఒక్క రోజులో రూ.8 లక్షల కోట్లు ఆవిరి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: బడ్జెట్ రోజైన ఆదివారం స్టాక్ మార్కెట్ రోజంతా హెచ్చుతగ్గులకు లోనైంది. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ దాదాపు 24 వేల పాయింట్లు పడిపోయింది. ఒకే బడ్జెట్ ప్రకటనతో ఏకంగా 80,500 కంటే తక్కువకు పడిపోయింది. నిఫ్టీ 50,750 పాయింట్లు పడిపోయి 25,500 కంటే తక్కువకు దిగజారింది. అయితే మధ్యాహ్నం 2 గంటల సమయానికి స్టాక్ మార్కెట్ తిరిగి కోలుకుంది. సెన్సెక్స్ దాదాపు 1 శాతం లేదా 780 పాయింట్లు తగ్గి 81,491.33 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 1 శాతం లేదా 250 పాయింట్లు తగ్గి 25,092 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆకస్మిక క్షీణతకు గల కారణాలు, స్టాక్ మార్కెట్ తిరిగి ఎలా కోలుకుందో తెలుసుకుందాం.
READ ALSO: UP Govt: ఆస్తి వివరాలు తెలపనందుకు జీతం నిలిపివేత.. 68,000 మందికి పైగా ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు
Also Read
- Sanjeev Bikhchandani: ఒక్క నిర్ణయం.. వేల కోట్ల సామ్రాజ్యం! నౌక్రీ.కామ్ బాస్ ఇన్వెస్ట్మెంట్ మ్యాజిక్ చూశారా?
- Mahendra Nahata: రూ.10 పెడితే రూ.5,800 కోట్ల ప్రాఫిట్.. అంబానీ కంపెనీలో ఈ ఇన్వెస్టర్ కొట్టిన జాక్పాట్ మామూలుగా లేదుగా!
- Stock Market: స్టాక్ మార్కెట్లో రక్తపాతం.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు.. కారణాలివే..
- Layoffs: టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ కలకలం.. ఏకంగా 21,000 మందిని తొలగించిన దిగ్గజ కంపెనీ..
అకస్మాత్తుగా ఎందుకు కుప్పకూలింది..
స్టాక్ మార్కెట్ అకస్మాత్తుగా కుప్పకూలడానికి ప్రత్యేక పన్ను (STT) పెరుగుదల కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (STT)ను పెంచారు. ఇది ఫ్యూచర్స్, ఆప్షన్లలో ట్రేడింగ్ చేసే పెట్టుబడిదారులకు పెద్ద దెబ్బగా మారింది. ఫ్యూచర్స్ కోసం STTని 0.025% నుంచి 0.05%కి పెంచారు. ఆప్షన్స్ ట్రేడింగ్ కోసం STTని కూడా 0.1% నుంచి 0.15%కి పెంచారు. గత సంవత్సరం కూడా ఈ పన్నును పెంచారు. ఈ ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్ భారీ క్షీణతను చవిచూసింది. ఒక్కసారిగా సెన్సెక్స్, నిఫ్టీ కుప్పకూలాయి. STT పెంపు ప్రకటించిన వెంటనే స్టాక్ మార్కెట్ గందరగోళంలో పడింది. పెట్టుబడిదారులు ఒకేసారి రూ.8 లక్షల కోట్లు కోల్పోయారు.
ఈ రోజు మార్కెట్ స్వల్ప పతనం తర్వాత తిరిగి పుంజుకుంది. ఎందుకంటే బడ్జెట్లో కొన్ని రంగాలకు ప్రత్యేక ప్రకటనలు చేయడం మార్కెట్ తిరిగి పుంజుకోవడానికి ప్రధాన కారణం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు మద్దతుగా పెద్ద ప్రకటన చేసింది, ఆ తర్వాత మౌలిక సదుపాయాలకు సంబంధించిన షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది. దేశీయ పరిశ్రమను ప్రోత్సహించడానికి, అనేక విషయాలపై మినహాయింపులు ఇచ్చారు. దీనితో పాటు MSME పరిశ్రమకు 10 వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు చేశారు. AI మద్దతు కోసం కూడా పెద్ద ప్రకటనలు చేశారు. వస్త్ర రంగానికి కూడా ప్రోత్సాహం ఇవ్వడం గురించి చర్చ జరిగింది. అకస్మాత్తుగా ఇంత భారీ పతనం సంభవించడంతో, కొన్ని పెద్ద క్యాప్ కంపెనీల షేర్ ధరలు పడిపోయాయి. దీంతో పెట్టుబడిదారులు ఆ షేర్లపై
ఆసక్తి చూపడంతో మార్కెట్ తిరిగి కోలుకుంది. అయితే స్టాక్ మార్కెట్ ఇప్పటికీ కూడా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది. సోమవారం విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్లోకి ప్రవేశించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 771 పాయింట్లు తగ్గి 81,498.07 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 277 పాయింట్లు తగ్గి 25,092 వద్ద ఉంది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కూడా 750 పాయింట్లు క్షీణించింది.
READ ALSO: India Budget 2026: మధ్యతరగతి ఆశలపై నీళ్లు.. సామాన్యుడి కన్నీళ్లు తుడవని నిర్మలమ్మ!
తాజావార్తలు
-
Sanjeev Bikhchandani: ఒక్క నిర్ణయం.. వేల కోట్ల సామ్రాజ్యం! నౌక్రీ.కామ్ బాస్ ఇన్వెస్ట్మెంట్ మ్యాజిక్ చూశారా?
-
Vijay – Trisha Breakup; ఒక్క పోస్టుతో అందరి నోళ్ళు మూయించిన త్రిష
-
Bharat tiwari: బీహార్ను కుదిపేస్తున్న భరత్ తివారీ ఎన్కౌంటర్.. పోలీసులపై ఎఫ్ఐఆర్.
-
Raviteja : రవితేజ కెరీర్కు ‘ఇరుముడి’ గండం గట్టెక్కిస్తుందా?
-
Toxic : కేజీఎఫ్ ఫార్ములానే.. అటు ఇటు చేసిన యష్!
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?