Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Global Internet Disruption: ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలను పెంచుతున్న ఇరాన్–అమెరికా వివాదం ఇప్పుడు మరో కీలక రంగంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. చమురు సరఫరా, అంతర్జాతీయ రవాణా, మార్కెట్లపై ఇప్పటికే ప్రభావం చూపుతున్న ఈ పరిస్థితి ఇప్పుడు ఇంటర్నెట్ సేవలపైనా ముప్పు తెచ్చేలా మారుతోంది. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లపై ఇరాన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు దారితీశాయి. ఇటీవల ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫఘారి సోషల్ మీడియా వేదిక Xలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. “ఇంటర్నెట్ కేబుళ్లపై రుసుములు విధిస్తాం” అని ఆయన చేసిన వ్యాఖ్యలు డిజిటల్ ప్రపంచంపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సముద్రగర్భ కేబుళ్లపైనే ప్రపంచ ఇంటర్నెట్ ఆధారం
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు ప్రధానంగా సముద్రం అడుగున వేసిన ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారా నడుస్తాయి. ఈ కేబుళ్లు దేశాలను ఒకదానితో ఒకటి అనుసంధానించి భారీ స్థాయిలో డేటా రవాణా చేస్తుంటాయి. హార్మూజ్ జలసంధి గుండా ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలను కలిపే అనేక కీలక కేబుళ్లు వెళ్తున్నాయి. ఫాల్కన్, జీబీఐసీఎస్, 2ఆఫ్రికా, సీమీవీ-6, ఏఏఈ-1 వంటి ప్రధాన అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుళ్లు ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తాయి. ఈ మార్గంలో ఏదైనా అంతరాయం కలిగితే ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇంటర్నెట్ సేవలు ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది.
Also Read
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
భారతదేశంపై కూడా ప్రభావం
భారతదేశానికి ఈ పరిస్థితి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే ఈ కేబుళ్లలో చాలా వరకు ముంబై, చెన్నై వంటి నగరాల ద్వారా భారతదేశానికి అనుసంధానించబడి ఉంటాయి. వీటి ద్వారా భారత్ గల్ఫ్ దేశాలు, యూరప్, ఆఫ్రికాతో డిజిటల్ కనెక్టివిటీ కొనసాగిస్తోంది. భారతి ఎయిర్ టెల్, రిలయన్స్ జియో వంటి ప్రధాన టెలికాం సంస్థలు కూడా ఈ నెట్వర్క్లపై ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈ మార్గంలో అంతరాయం, అదనపు రుసుములు లేదా కేబుళ్లకు నష్టం జరిగితే భారతీయ వినియోగదారులపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంది.
రోజువారీ జీవితంపై ప్రభావం
ప్రస్తుతం ఇంటర్నెట్ కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాదు. బ్యాంకింగ్ సేవలు, యూపీఐ చెల్లింపులు, ఆన్లైన్ విద్య, కార్యాలయ పనులు, వీడియో స్ట్రీమింగ్, కార్పొరేట్ డేటా సేవలు అన్నీ ఇంటర్నెట్పైనే ఆధారపడి ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇంటర్నెట్ సేవలు నెమ్మదించటం లేదా అంతరాయం కలగటం వల్ల సాధారణ ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది. ఇంటర్నెట్ కేబుళ్లకు ఏదైనా సాంకేతిక లోపం వచ్చినా వాటిని సముద్రగర్భంలో మరమ్మతు చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అందువల్ల సేవలు పునరుద్ధరించడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం కూడా ఉంది.
ప్రపంచానికి కొత్త హెచ్చరిక
హార్మూజ్ జలసంధి ఇప్పటివరకు చమురు రవాణాకు కీలక కేంద్రంగా మాత్రమే గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు అది డిజిటల్ ప్రపంచానికి కూడా అత్యంత కీలకమైన మార్గంగా మారింది. ఇరాన్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో భవిష్యత్తులో ఇంటర్నెట్ సేవల భద్రత, డేటా రవాణా మరియు ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలపై కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధ ప్రభావం కేవలం సైనిక రంగానికే పరిమితం కాకుండా ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని కూడా తాకే పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
-
US Cuba Drone Tension: ఇరాన్కు తీసిపోని క్యూబా.. అమెరికా దాడి చేస్తే భారీ రక్తపాతమే!
-
Hyderabad Horror: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!