Congress: ‘‘వినాశక దారిలో కాంగ్రెస్’’.. తమిళనాడు ఎంపీ జోతిమణి వార్నింగ్..
- తమిళనాడులో కాంగ్రెస్ వినాశక దారిలో వెళ్తోంది..
- పార్టీ ఎంపీ జోతిమణి సంచలన వ్యాఖ్యలు..
- బయటపడుతున్న కాంగ్రెస్ వర్గపోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: తమిళనాడులో కాంగ్రెస్ వర్గపోరు వీధిన పడింది. కాంగ్రెస్ కరూర్ ఎంపీ జోతిమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని ఒక వర్గంపై విమర్శలు గుప్పించారు. ‘‘ఒక వర్గం కాచుకుని కూర్చుని, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడానికి, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి, ఈ గడ్డపై సామాజిక న్యాయం, అభివృద్ధి విధానాలను పాతిపెట్టడానికి ఏ అవకాశాన్ని అయినా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉంది’’ అని ఆమె అన్నారు. ప్రజల సమస్యల గురించి వదిలిపెట్టి, వర్గపోరాటాల్లో నిమగ్నమై, తమిళనాడు కాంగ్రెస్ కొద్దిమంది స్వార్థ ప్రయోజనాల కోసం వినాశకర మార్గంలో పయనిస్తోందని ఆమె అన్నారు.
Also Read
- Yogi Adityanath: మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పించమంటారా.? అఖిలేష్కు సీఎం యోగి వార్నింగ్..
- Rahul Gandhi: ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికలు మనవే.. కానీ ఎన్నికలు సజావుగా జరగవు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
- Lt General Dhiraj Seth: కొత్త ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
- West Bengal: అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా.. మమతా బెనర్జీ ఉరుకులు పరుగులు..
తమిళనాడు కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళనల్ని కలిగిస్తున్నాయని, రోజు రోజు రాష్ట్ర కాంగ్రెస్ తప్పుడు కారణాల వల్ల వార్తల్లో నిలుస్తోందని ఆమె ఆవేదన వ్యక్తపరిచారు. తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న గుర్తింపు, గౌరవం నెహ్రూ గాంధీ కుటుంబాలు చేసిన త్యాగాల నుంచి వచ్చాయని, రాహుల్ గాంధీ నిస్వార్థ, నిర్భయ రాజకీయాలకు పూర్తి వ్యతిరేక మార్గంలో పయనిస్తోందని చెప్పారు. రాహుల్ గాంధీ అవిశ్రాంత కృషిని, సాటిలేని త్యాగాలను మనం మోసం చేయలేము అని ఆమె అన్నారు.
పార్టీ డేటా వింగ్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి, తమిళనాడు అప్పుల్ని బీజేపీ పాలిత యూపీతో పోల్చడం వివాదాస్పదమైంది. డీఎంకే ఎంపీ కనిమొళి తమిళనాడు అభివృద్ధిలో దూసుకుపోతుందనే సోషల్ మీడియా పోస్టుపై చక్రవర్తి ఈ విమర్శలు చేశారు. తమిళనాడును, యూపీతో పోల్చడం అన్యాయమని జోతిమణి అన్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ చక్రవర్తి కూడా స్పందించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ గొంతును కాంగ్రెస్ లోపల ఎవరూ వినిపించడానికి తాము అనుమతించమని అన్నారు. ఈ వివాదం కాంగ్రెస్-డీఎంకే మిత్రపక్ష సంబంధాలపై ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది ఎన్నికలు జరగబోయే తమిళనాడులో బీజేపీ అవకాశంగా మార్చుకుని విమర్శలు చేస్తోంది.
తాజావార్తలు
-
US-Iran: 24 గంటల్లో శాంతి ఒప్పందం ఖరారు.. పాక్ ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన
-
Nagarjuna: మనోడు లెనిన్ 10th జులై వస్తున్నాడు!
-
Bangladesh: క్రికెటర్పై పోలీసుల దాడి.. బంగ్లాదేశ్లో కలకలం
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Smart Kitchen Hacks: వంటింట్లో ఇలా చేస్తే శ్రమ, సమయం, డబ్బు ఆదా.. గృహిణులకు మోస్ట్ యూస్ఫుల్ టిప్స్!
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!