Congress: ‘‘వినాశక దారిలో కాంగ్రెస్’’.. తమిళనాడు ఎంపీ జోతిమణి వార్నింగ్..
- తమిళనాడులో కాంగ్రెస్ వినాశక దారిలో వెళ్తోంది..
- పార్టీ ఎంపీ జోతిమణి సంచలన వ్యాఖ్యలు..
- బయటపడుతున్న కాంగ్రెస్ వర్గపోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: తమిళనాడులో కాంగ్రెస్ వర్గపోరు వీధిన పడింది. కాంగ్రెస్ కరూర్ ఎంపీ జోతిమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని ఒక వర్గంపై విమర్శలు గుప్పించారు. ‘‘ఒక వర్గం కాచుకుని కూర్చుని, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడానికి, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి, ఈ గడ్డపై సామాజిక న్యాయం, అభివృద్ధి విధానాలను పాతిపెట్టడానికి ఏ అవకాశాన్ని అయినా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉంది’’ అని ఆమె అన్నారు. ప్రజల సమస్యల గురించి వదిలిపెట్టి, వర్గపోరాటాల్లో నిమగ్నమై, తమిళనాడు కాంగ్రెస్ కొద్దిమంది స్వార్థ ప్రయోజనాల కోసం వినాశకర మార్గంలో పయనిస్తోందని ఆమె అన్నారు.
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Pulwama Attack: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పుల్వామా దాడి సూత్రధారి.. హమ్జా బుర్హాన్ను కాల్చి చంపిన దుండగులు
- Diesel: డీజిల్ కొరత, ధరల పెరుగుదల వేళ శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
తమిళనాడు కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళనల్ని కలిగిస్తున్నాయని, రోజు రోజు రాష్ట్ర కాంగ్రెస్ తప్పుడు కారణాల వల్ల వార్తల్లో నిలుస్తోందని ఆమె ఆవేదన వ్యక్తపరిచారు. తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న గుర్తింపు, గౌరవం నెహ్రూ గాంధీ కుటుంబాలు చేసిన త్యాగాల నుంచి వచ్చాయని, రాహుల్ గాంధీ నిస్వార్థ, నిర్భయ రాజకీయాలకు పూర్తి వ్యతిరేక మార్గంలో పయనిస్తోందని చెప్పారు. రాహుల్ గాంధీ అవిశ్రాంత కృషిని, సాటిలేని త్యాగాలను మనం మోసం చేయలేము అని ఆమె అన్నారు.
పార్టీ డేటా వింగ్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి, తమిళనాడు అప్పుల్ని బీజేపీ పాలిత యూపీతో పోల్చడం వివాదాస్పదమైంది. డీఎంకే ఎంపీ కనిమొళి తమిళనాడు అభివృద్ధిలో దూసుకుపోతుందనే సోషల్ మీడియా పోస్టుపై చక్రవర్తి ఈ విమర్శలు చేశారు. తమిళనాడును, యూపీతో పోల్చడం అన్యాయమని జోతిమణి అన్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ చక్రవర్తి కూడా స్పందించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ గొంతును కాంగ్రెస్ లోపల ఎవరూ వినిపించడానికి తాము అనుమతించమని అన్నారు. ఈ వివాదం కాంగ్రెస్-డీఎంకే మిత్రపక్ష సంబంధాలపై ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది ఎన్నికలు జరగబోయే తమిళనాడులో బీజేపీ అవకాశంగా మార్చుకుని విమర్శలు చేస్తోంది.
తాజావార్తలు
-
Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
-
Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
-
Sharvari Wagh: షూటింగ్లో అలియాను చూసి ఎన్నో నేర్చుకున్నా: శార్వరీ
-
Ruturaj Gaikwad: ముగిసిన సీఎస్కే ప్రయాణం.. ధోనీ రిటైర్మెంట్పై CSK కెప్టెన్ సంచలన ప్రకటన..
-
US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!