New Delhi: మంత్రి కుమారుడిపై అత్యాచార ఆరోపణలు చేసిన యువతిపై ఇంక్ దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్తాన్ కేబినెట్ మంత్రి మహేష్ జోషి కుమారుడిపై అత్యాచార ఆరోపణలు చేసిన 23 ఏళ్ల యువతిపై ఢిల్లీలో కొంతమంది దుండగులు సిరా దాడి చేశారు. సిరాను ఆమె మొహంపై వేసి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ ప్రారంభించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఆగ్నేయ జిల్లా) ఈషా పాండే మాట్లాడుతూ.. శనివారం రాత్రి కొందరు దుండగులు యువతిపై ఏదో విసిరి పారిపోయారని తమకు కాల్ వచ్చిందని చెప్పారు. దాడి జరిగిన వెంటనే మహిళను ఎయిమ్స్ ట్రామా సెంటర్ కు తరలించారు.
శనివారం రాత్రి 9.30 గంటలకు కాళింది కుంజ్ రోడ్డ సమీపంలో తన తల్లితో కలిసి నడుచుకుంటూ వస్తున్న బాధితురాలిపై ఇద్దరు వ్యక్తులు ఇంక్ విసిరి పారిపోయారు. ఆమె ఫిర్యాదు ప్రకారం ఐపీసీ 195 A (ఎవరినైనా తప్పుడు సాక్ష్యం చెప్పమని బెదిరించడం), 506 (నేరపూరిత బెదిరింపులకు శిక్ష), 323 (స్వచ్ఛందంగా గాయపరిచినందుకు శిక్ష) మరియు 34 (అనేక వ్యక్తులు చేసిన చర్యలు) కింద షాహీన్ బాగ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
ఈ ఘటనకు ముందు రాజస్తాన్ క్యాబినెట్ మంత్రి మహేష్ జోషి కుమారుడు రోహిత్ జోషిపై సదరు బాధిత యువతి సదర్ బజార్ పోలీస్ స్టేషన్ లో అత్యాచారం కేసు పెట్టింది. 2020లో ఫేస్ బుక్ ద్వారా రోహిత్ జోషి తనతో పరిచయం పెంచుకున్నాడని.. ఆమె ఆరోపించింది. జనవరి 8, 2021లో సవాయ్ మాధోపూర్ కు తీసుకెళ్లి, మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి తనపై తన ప్రమేయం లేకుండా అత్యాచారం చేశాడని ఆరోపిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషనర్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ నివేదిక కోరారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన కుమారుడిని కాపాడటానికి ప్రయత్నించ వద్దని ఆమె కోరారు. బాధిత యువతికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సిరాతో దాడి చేయడం, ఆమెను బెదిరిండంపై మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసుల నుంచి నివేదిక కోరింది.
తాజావార్తలు
-
Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
-
Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
-
Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్ఫ్లేట్ అవుతున్నాయి’!
-
Best AI Laptops 2026: AI ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 పవర్ఫుల్ ల్యాప్టాప్లు బెస్ట్ ఆప్షన్స్!
-
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!