Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్పై చైనా-పాక్ జాయింట్ స్టేట్మెంట్.. భారత్ ఘాటు రిప్లై..
- జమ్మూకాశ్మీర్పై చైనా-పాక్ జాయింట్ స్టేట్మెంట్..
- తీవ్రంగా స్పందించిన భారత్..
- జమ్మూకాశ్మీర్
- లడఖ్ భారత్లో అంతర్భాగాలు..
- భారత విదేశాంగ శాఖ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ని ఉద్దేశించి పాకిస్తాన్-చైనాలు చేసిన సంయుక్త ప్రకటనను భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. లడఖ్తో సహా కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ భారత్లో అవిభాజిత భాగాలని, విడదీయరాని ప్రాంతమని ఘాటుగా స్పందించింది. చైనా-పాక్ సంయుక్త ప్రకటన అనవసర సూచనలుగా భారత్ విమర్శించింది. పాక్ ప్రధాని షెహబాష్ షరీఫ్ జూన్ 4 నుంచి 8 వరకు చైనాలో పర్యటించారు. చైనా ప్రెసిడెంట్ జి జిన్పింగ్తో సమావేశమైన తర్వాత భారత్ ప్రతిస్పందన వచ్చింది. ఈ భేటీలో పాక్, చైనాలు డ్రీమ్ ప్రాజెక్ట్ చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) గురించి కూడా చర్చించాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రోడ్డు, ఇతర కార్యకలాపాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) నుంచి వెళ్తుండటాన్ని భారత్ తీవ్రంగా తప్పుబడుతోంది.
జూన్ 7న పాక్-చైనాలు జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ తాజా పరిణామాలను పాకిస్తాన్ చైనాకు వివరించిందని, జమ్మూ కాశ్మీర్ వివాదం చరిత్రలో మిగిలిపోయిందని, యూఎన్ చార్టర్కి అనుగుణంగా శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సంయుక్త ప్రకటన చేశాయి. అయితే, దీనిని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది.
Also Read
- Lalit Modi: 'ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు', సుష్మితా సేన్తో తన బ్రేకప్పై మౌనం వీడిన లలిత్ మోడీ..
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
Read Also: Ajit Doval: మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్.. పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు
‘‘జూన్ 7 నాటి చైనా మరియు పాకిస్తాన్ల మధ్య సంయుక్త ప్రకటనలో జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంపై అనవసరమైన సూచనలను మేము గుర్తించాము. మేము అటువంటి సూచనలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాము. ఈ సమస్యపై మా వైఖరి స్థిరంగా ఉంది మరియు సంబంధిత పార్టీలకు బాగా తెలుసు’’ అని విదేశీ వ్యవహారాల (ఎంఈఏ) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం భారతదేశంలోని అంతర్భాగాలు మరియు విడదీయరాని భాగాలుగా ఉన్నాయి, అలాగే ఉంటాయి. మరే ఇతర దేశానికీ దీనిపై వ్యాఖ్యానించే అధికారం లేదని అన్నారు.
పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టు, చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సులను కలుపుతూ 3000 కి.మీ మేర 50 బిలియన్ డాలర్లతో సీపెక్ కారిడార్ని చైనా నిర్మిస్తోంది. ఇది భారత్లో అంతర్భాగంగా చెప్పబడుతున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్టాన్ గుండా వెళ్తోంది. ఇది తమ సార్వభౌమాత్వాన్ని ఉల్లంఘించడమే అని భారత్ చాలా సార్లు చెప్పింది.
- Tags
- china
- CPEC
- india
- jammu kashmir
- Pakistan
తాజావార్తలు
-
Housing Loan: అలెర్ట్..అలెర్ట్.. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటున్నారా? ఆర్థిక నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
-
Hellfire Missile Explained: అమెరికా సీక్రెట్ వెపన్.. టార్గెట్ ఫిక్స్ చేసి కొడితే శత్రు నౌకల గుండెలు పేలాల్సిందే!
-
Airtel: రూ.99కే ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియం.. 20కి పైగా OTT యాప్లకు యాక్సెస్
-
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!