Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్పై చైనా-పాక్ జాయింట్ స్టేట్మెంట్.. భారత్ ఘాటు రిప్లై..
- జమ్మూకాశ్మీర్పై చైనా-పాక్ జాయింట్ స్టేట్మెంట్..
- తీవ్రంగా స్పందించిన భారత్..
- జమ్మూకాశ్మీర్
- లడఖ్ భారత్లో అంతర్భాగాలు..
- భారత విదేశాంగ శాఖ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ని ఉద్దేశించి పాకిస్తాన్-చైనాలు చేసిన సంయుక్త ప్రకటనను భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. లడఖ్తో సహా కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ భారత్లో అవిభాజిత భాగాలని, విడదీయరాని ప్రాంతమని ఘాటుగా స్పందించింది. చైనా-పాక్ సంయుక్త ప్రకటన అనవసర సూచనలుగా భారత్ విమర్శించింది. పాక్ ప్రధాని షెహబాష్ షరీఫ్ జూన్ 4 నుంచి 8 వరకు చైనాలో పర్యటించారు. చైనా ప్రెసిడెంట్ జి జిన్పింగ్తో సమావేశమైన తర్వాత భారత్ ప్రతిస్పందన వచ్చింది. ఈ భేటీలో పాక్, చైనాలు డ్రీమ్ ప్రాజెక్ట్ చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) గురించి కూడా చర్చించాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రోడ్డు, ఇతర కార్యకలాపాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) నుంచి వెళ్తుండటాన్ని భారత్ తీవ్రంగా తప్పుబడుతోంది.
జూన్ 7న పాక్-చైనాలు జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ తాజా పరిణామాలను పాకిస్తాన్ చైనాకు వివరించిందని, జమ్మూ కాశ్మీర్ వివాదం చరిత్రలో మిగిలిపోయిందని, యూఎన్ చార్టర్కి అనుగుణంగా శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సంయుక్త ప్రకటన చేశాయి. అయితే, దీనిని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది.
Also Read
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
- El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
Read Also: Ajit Doval: మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్.. పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు
‘‘జూన్ 7 నాటి చైనా మరియు పాకిస్తాన్ల మధ్య సంయుక్త ప్రకటనలో జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంపై అనవసరమైన సూచనలను మేము గుర్తించాము. మేము అటువంటి సూచనలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాము. ఈ సమస్యపై మా వైఖరి స్థిరంగా ఉంది మరియు సంబంధిత పార్టీలకు బాగా తెలుసు’’ అని విదేశీ వ్యవహారాల (ఎంఈఏ) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం భారతదేశంలోని అంతర్భాగాలు మరియు విడదీయరాని భాగాలుగా ఉన్నాయి, అలాగే ఉంటాయి. మరే ఇతర దేశానికీ దీనిపై వ్యాఖ్యానించే అధికారం లేదని అన్నారు.
పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టు, చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సులను కలుపుతూ 3000 కి.మీ మేర 50 బిలియన్ డాలర్లతో సీపెక్ కారిడార్ని చైనా నిర్మిస్తోంది. ఇది భారత్లో అంతర్భాగంగా చెప్పబడుతున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్టాన్ గుండా వెళ్తోంది. ఇది తమ సార్వభౌమాత్వాన్ని ఉల్లంఘించడమే అని భారత్ చాలా సార్లు చెప్పింది.
- Tags
- china
- CPEC
- india
- jammu kashmir
- Pakistan
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!