Private Train: దేశంలో పట్టాలెక్కిన తొలి ప్రైవేటు రైలు
దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు రైలు సర్వీస్ ప్రారంభమైంది. ‘భారత్ గౌరవ్’ పేరుతో ప్రైవేటు రైళ్లను నడుపనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ గౌరవ్’ పేరుతో ప్రైవేటు రైళ్లను నడుపనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు తొలి ప్రైవేటు రైలు తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ నుంచి మహారాష్ట్రలోని షిరిడీ సాయినగర్కు మంగళవారం సాయంత్రం 6 గంటలకు బ యల్దేరింది. దీంతో దేశంలోనే తొలి ప్రైవేటు రైలు సర్వీసును ప్రారంభించిన ఘనత దక్షిణ రైల్వేకి దక్కింది.
20 బోగీలు కలిగిన ఈ రైలును సేలం డివిజన్ డివిజినల్ రైల్వే మేనేజర్ గౌతమ్ శ్రీనివాస్ ప్రారంభించారు. తొలి రోజే ఈ రైలులో 1,100 మంది ప్రయాణించారు. ఈ ప్రైవేటు రైలు గురువారం ఉదయం 7.25 గంటలకు షిరిడీ చేరుతుంది. తిరుప్పూరు, ఈరోడ్, సేలం, యెలహంక, ధర్మవరం, మంత్రాలయం స్టేషన్లలో ఆగనుంది. షిరిడి చేరుకున్నాక ప్రయాణికులకు బస్సు సదుపాయం, సాయి దేవాలయ దర్శనం తదితర ఏర్పాట్లను కూడా కల్పిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో ఈ రైలు మంత్రాలయం వద్ద 5 గంటలు ఆగుతుంది. ఆ సమయంలో భక్తులు మంత్రాలయం దర్శనం చేసుకుని రావచ్చు.
కాగా, 20 బోగీలు కలిగిన ఈ రైలులో 1500 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉందని దక్షిణ రైల్వే సీపీఆర్వో గుగణేశన్ తెలిపారు. ఇందులో ఏసీ కోచ్లతోపాటు స్లీపర్ కోచ్లు ఉన్నాయన్నారు. ఈ రైలును నిర్వాహకులకు రెండేళ్ల కాలపరిమితికి లీజుకిచ్చినట్లు ఆయన తెలిపారు. నెలలో కనీసం 3 ట్రిప్పులు నడపనున్నట్లు పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్..!
-
NTPC: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు.. 35 ఏళ్లున్నా అప్లై చేసుకోవచ్చు
-
Malacca Strait: షాకింగ్..! హార్మూజ్ తర్వాత మలక్కా జలసంధి.. ఇరాన్ పన్నుల దారిలో మరో ముస్లిం దేశం..!
-
Stop SIP: మార్కెట్ పడిపోతుందని SIP ఆపేస్తున్నారా..? అయితే మీరు కచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే..
-
Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!