USA: భారతీయ టెక్కీ, ఎంటర్ప్రెన్యూర్ అమెరికాలోని వాషింగ్టన్లో తన భార్య, కొడుకును కాల్చి చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఏప్రిల్ 24న జరిగింది. మరో కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రోబోటిక్స్లో నిపుణుడు అయిన హర్షవర్ధన కిక్కెరీ హోలో వరల్డ్కి వ్యవస్థాపకుడు. ఈ కంపెనీ 2022లో మూతపడింది.
హర్షవర్ధన్ గత వారం తన ఇంట్లో భార్య, అతడి కుమారుడిని కాల్చి చంపినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. సంఘటన సమయంలో మరో కుమారుడు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మృతులను హర్షవర్ధన ఎస్ కిక్కేరి (57), అతని భార్య శ్వేత పాణ్యం (44), మరియు వారి 14 ఏళ్ల కుమారుడుగా గుర్తించారు.
Read Also: Kawasaki Versys 650: కొత్త లుక్, ప్రమాణాలతో అదరగొట్టిన అడ్వెంచర్ టూరర్.. కవాసకి వెర్సిస్ 650..!
అయితే, ఈ దారుణమైన సంఘటనకు కారణం ఇంకా తెలియరాలేదు. ఇరుగుపొరుగు వారు మాత్రం, హర్ష కుటుంబం తమతో స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ, కొద్దిగా రిజర్వ్డ్గా ఉండేవారని చెప్పారు. మాండ్యా జిల్లాలోని కేఆర్ పేట్ తాలుకాకు చెందిన హర్ష మైసూరులోని రోబోటిక్స్ కంపెనీ హోలో వరల్డ్ని స్థాపించాడు. దీనికి అతను సీఈఓ కాగా, భార్య సహ వ్యవస్థాపకురాలిగా ఉంది. 2017లో వీరు అమెరికా నుంచి ఇండియా వచ్చి ఈ కంపెనీని స్థాపించారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల 2022లో మూతపడిపోవడంతో తిరిగి అమెరికా వెళ్లారు. గతంలో సరిహద్దుల భద్రతలో రోబోలని ఉపయోగించాలని ఒకసారి ప్రధాని మోడీని కూడా కలిశారు. గతంలో హర్ష మైక్రోసాఫ్ట్లో కూడా పనిచేశారు.