Site icon NTV Telugu

Railway Charges : రైల్వే ప్రయాణికులకు షాక్.. ఛార్జీల పెంపు..

Indianrailway

Indianrailway

Railway Charges : రైల్వే ప్రయాణికులకు షాక్ తగిలింది. రైట్వే టికెట్ ఛార్జీలను పెంచింది కేంద్ర ప్రభుత్వం. పెరిగిన ఛార్జీలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. అన్ని రకాల రైళ్లలోని ఏసీ క్లాస్ లలో కిలోమీటర్ కు రూ.2 పైసలు పెంచారు. అలాగే నాన్ ఏసీలో కిలో మీటర్ కు ఒక పైసా చొప్పున ఛార్జీలు పెంచారు. ఆర్డినరీ సెకండ్ క్లాస్‌లో 500 కిలో మీటర్ వరకు సాధారణ ఛార్జీలే ఉంటాయి. 501 నుంచి 1500 కి.మీ వరకు టికెట్‌పై రూ.5 వరకు పెంచారు.

read also : Star Directors : ఈ స్టార్ డైరెక్టర్లకు ఏమైంది.. ఇక సినిమాలు తీయరా..?

అలాగే 1501 కి.మీ నుంచి 2500 కి.మీ వరకు టికెట్‌పై రూ.10 వరకు పెంచారు. 2501 నుంచి 3000 కి.మీ వరకు రూ.15 చొప్పున పెంచారు. ఆర్డినరీ స్లీపర్ క్లాస్ టికెట్ల మీద కిలోమీటర్ కు అరపైసా చొప్పున పెంచారు. మెయిల్/ఎక్స్‌ప్రెస్‌ (నాన్ ఏసీ) రైళ్లలో టికెట్లపై నాన్ ఏసీ ఫస్ట్, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై కి.మీకు ఒక పైసా చొప్పున పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. జులై 1 నుంచే ఈ పెరిగిన ఛార్జీలు అమలు కాబోతున్నాయి. దీని కోసం ఇప్పటికే ఆర్డర్లు కూడా వెళ్లాయి.

read also : Dilraju : రామ్ చరణ్‌ వల్లే నష్టాల నుంచి బయటపడ్డా

Exit mobile version