2036 Olympics: 2036 ఒలింపిక్స్ గేమ్స్కి ఇండియా బిడ్డింగ్.. కన్ఫామ్ చేసిన ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2036 Olympics: 2036 ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహణకు భారత్ ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టదని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించాలనే ఇండియా అభిప్రాయాన్ని ఆయన నొక్కిచెప్పారు. 2036 ఒలింపిక్స్ నిర్వహించేందుకు భారత్ బిడ్డింగ్ వెస్తుందని తెలిపారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC) 141వ సెషన్ని మోడీ ప్రారంభించారు. 40 ఏళ్ల విరామం తర్వాత ఇండియాలో ఒలింపిక్ సెషన్ జరుగుతోంది. భారతదేశంలో చివరి ఒలింపిక్ సెషన్ 1983లో న్యూఢిల్లీలో జరిగింది. 2029 యూత్ ఒలింపిక్స్కు భారత్ ఆతిథ్యం ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
ఇది 140 కోట్ల మంది భారతీయుల కల అని.. మీ మద్దతుతో మేము ఈ కలను నెరవేర్చాలని అనుకుంటున్నామని ఆయన అన్నారు. 2029 యూత్ ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, భారతదేశానికి ఐఓసీ నుంచి నిరంతర మద్దతు లభిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని ప్రధాని మోడీ అన్నారు. క్రీడా స్పూర్తి విశ్వవ్యాప్తం అని.. ఓడిపోయిన వారు ఉండరని, క్రీడల్లో విజేతలు, అభ్యాసకులు మాత్రమే ఉంటారని చెప్పారు. క్రీడలు మానవాళిని శక్తివంతం చేస్తారు. ఎవరు రికార్డు బద్డలు కొట్టినా, ప్రతీ ఒక్కరూ దాన్ని స్వాగతిస్తారని అన్నారు.
Also Read
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
Read Also: IMF: ఇంధన ధరలు, ప్రపంచ జీడీపీపై ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ ప్రభావం..
అంతకుముందు ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ మాట్లాడుతూ.. ‘నమస్తే’ అని పలకరించారు. హిందీలో మాట్లాడుతూ.. ‘ఆప్కా బహుత్ బహుత్ స్వాగత్ హై’ అని ప్రధాని నరేంద్రమోడీని స్వాగతించారు. ఆయన మాట్లాడుతూ.. భారతదేశం ఒక స్పూర్తిదాయకమైన ప్రదేశమని అన్నారు. ఆర్టిఫిషియల్(AI) గురించి మాట్లాడుతూ.. ఏఐ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయబడిందని, రాబోయే రెండు రోజుల్లో జరగనున్న 141వ ఐఓసీ సెషన్ లో దీనిపై మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ఏఐ, ఈ-స్పోర్ట్స్ ఒలింపిక్ ఉద్యమానికి రెండు కొత్త అవకాశాలని బాచ్ అన్నారు. 2024లో ప్యారిస్ ఒలింపిక్స్ ప్రీ-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగానికి చివరిదని తెలిపారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్, బాలీవుడ్ స్టార్స్ రణ్బీర్ కపూర్, అలియా భట్, దీపికా పదుకొణే పాల్గొన్నారు.
అంతకుముందు.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి మరింత ఆదరణ లభిస్తున్నందున 2028 ఒలింపిక్స్ లో క్రికెట్కి చోటు కల్పిస్తున్నట్లు శుక్రవారం థామస్ బాచ్ మీడియా సమావేశంలో తెలిపారు. ప్రస్తుతం భారత్ విజయవంతంగా వన్డే ప్రపంచకప్ నిర్వహిస్తోందని, భారతీయులు, భారత సంతతి ప్రజలు క్రికెట్ ఆడుతారని, ఇటీవల తాము డల్లాస్ లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించామని ఆయన తెలిపారు. అందువల్లే లాస్ ఏంజిల్స్ లో జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్కి చోటు కల్పించినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!