INS Arighaat: అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష
- భారత్కు చెందిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ ద్వారా కే4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష..
- 3,500 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా సిద్ధం చేసిన రక్షణ శాఖ..
- ప్రపంచంలోనే క్షిపణులను ప్రయోగించగల అణు జలాంతర్గాములు కలిగిన దేశాల్లో భారత్ ఆరోది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INS Arighaat: భారత్కు చెందిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి కే4 బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. విశాఖ తీరంలో భారత నౌకాదళం దీనిని నిర్వహించిందని రక్షణ రంగ అధికారులు చెప్పారు. అరిఘాత్ నుంచి కే4 క్షిపణిని పరీక్షించడం ఇదే మొదటిసారి. 3,500 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా మంగళవారం నిర్వహించిన ఈ ప్రయోగం యొక్క ఫలితాలను విశ్లేషిస్తున్నారు. ఐఎన్ఎస్ అరిఘాత్ను రెండు నెలల క్రితమే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఐఎన్ఎస్ అరిహంత్ మాదిరిగానే అరిఘాత్ నిర్మాణాన్ని కూడా తూర్పు నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకల స్థావరం విశాఖపట్నం నేవల్ డాక్ యార్డులోని ‘షిప్ బిల్డింగ్ సెంటర్’లో 2011 డిసెంబరులో చేపట్టగా.. తొలిదశ నిర్మాణం తర్వాత 2017 నవంబర్ 19న జల ప్రవేశం చేసింది. ఆ తర్వాత అంతర్గత విభాగాల పరికరాల బిగింపు, ఆధునిక టెక్నాలజీతో రాడార్ వ్యవస్థ, ఆయుధ సంపత్తిని సమకూర్చడం లాంటి కీలక పనులన్నింటినీ కంప్లీట్ చేశారు.
Read Also: Pawan Kalyan : చివరి దశలో ‘హరి హర వీర మల్లు పార్ట్-1 షూటింగ్
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
అయితే, ప్రపంచంలోనే బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించ గల అణు జలాంతర్గాములు కలిగి ఉన్న దేశాల్లో భారతదేశం ఆరోది. ఇక, భారత్ కంటే ముందు అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా ఉన్నాయి. అలాగే, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే కే-15, కే-4 క్షిపణులను కూడా భారత్ ప్రస్తుతం అభివృద్ధి చేస్తుంది. చైనాను దృష్టిలో ఉంచుకొని 3500 కిలో మీటర్ల దూరంలోని టార్గెట్ లను ఈజీగా ఛేదించేలా వాటిని రూపొందిస్తున్నట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!