INS Arighaat: అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష
- భారత్కు చెందిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ ద్వారా కే4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష..
- 3,500 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా సిద్ధం చేసిన రక్షణ శాఖ..
- ప్రపంచంలోనే క్షిపణులను ప్రయోగించగల అణు జలాంతర్గాములు కలిగిన దేశాల్లో భారత్ ఆరోది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INS Arighaat: భారత్కు చెందిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి కే4 బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. విశాఖ తీరంలో భారత నౌకాదళం దీనిని నిర్వహించిందని రక్షణ రంగ అధికారులు చెప్పారు. అరిఘాత్ నుంచి కే4 క్షిపణిని పరీక్షించడం ఇదే మొదటిసారి. 3,500 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా మంగళవారం నిర్వహించిన ఈ ప్రయోగం యొక్క ఫలితాలను విశ్లేషిస్తున్నారు. ఐఎన్ఎస్ అరిఘాత్ను రెండు నెలల క్రితమే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఐఎన్ఎస్ అరిహంత్ మాదిరిగానే అరిఘాత్ నిర్మాణాన్ని కూడా తూర్పు నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకల స్థావరం విశాఖపట్నం నేవల్ డాక్ యార్డులోని ‘షిప్ బిల్డింగ్ సెంటర్’లో 2011 డిసెంబరులో చేపట్టగా.. తొలిదశ నిర్మాణం తర్వాత 2017 నవంబర్ 19న జల ప్రవేశం చేసింది. ఆ తర్వాత అంతర్గత విభాగాల పరికరాల బిగింపు, ఆధునిక టెక్నాలజీతో రాడార్ వ్యవస్థ, ఆయుధ సంపత్తిని సమకూర్చడం లాంటి కీలక పనులన్నింటినీ కంప్లీట్ చేశారు.
Read Also: Pawan Kalyan : చివరి దశలో ‘హరి హర వీర మల్లు పార్ట్-1 షూటింగ్
Also Read
- Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
- Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
- Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
- India-Nepal Border Dispute: భారత్తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
అయితే, ప్రపంచంలోనే బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించ గల అణు జలాంతర్గాములు కలిగి ఉన్న దేశాల్లో భారతదేశం ఆరోది. ఇక, భారత్ కంటే ముందు అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా ఉన్నాయి. అలాగే, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే కే-15, కే-4 క్షిపణులను కూడా భారత్ ప్రస్తుతం అభివృద్ధి చేస్తుంది. చైనాను దృష్టిలో ఉంచుకొని 3500 కిలో మీటర్ల దూరంలోని టార్గెట్ లను ఈజీగా ఛేదించేలా వాటిని రూపొందిస్తున్నట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్పై హాట్ చర్చ!
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!