CAA: భారతీయ ముస్లింలు సీఏఏని స్వాగతించాలి: ఆల్ ఇండియా ముస్లిం జమాత్ చీఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CAA: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ)ని భారతదేశ ముస్లింలతా స్వాగతించాలని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రిజ్వీ బర్వేలీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సీఏఏని నోటిఫై చేసిన కొన్ని గంటల తర్వాత ఆయన మాట్లాడుతూ.. చట్టాన్ని స్వాగతించారు. ముస్లిం సమాజంలో భయాలను తొలగించడానికి ప్రయత్నించాలని, సీఏఏ ప్రభావం భారతీయ ముస్లింపై, వారి పౌరసత్వంపై ఉండదని అన్నారు. భారత ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని అమలు చేసింది, దాన్ని నేను స్వాగతిస్తున్నానని చెప్పారు. ఈ చట్టం ఇంతకుముందే అమలులోకి రావాలి, కానీ ఎప్పుడూ లేనంత ఆలస్యం జరిగిందని అన్నారు.
ఈ చట్టం గురించి ముస్లింలతో చాలా అపార్థాలు ఉన్నాయని, ఈ చట్టం వల్ల ఏమీ దకాని, ముస్లింలతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లతో మతం ఆధారంగా అఘాయిత్యాలు ఎదుర్కొంటున్న ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు ఇంతకుముందు ఎలాంటి చట్టం లేదని మౌలానా అన్నారు. కోట్ల మంది భారతీయులు ఈ చట్టం వల్ల అసలు ప్రభావితం కారని, ఈ చట్టం ఏ ముస్లిం పౌరసత్వాన్ని తీసేయదని, రాజకీయ నాయకులు ముస్లింలతో అపార్థాలు సృష్టిస్తున్నారని, భారతదేశంలోని ప్రతీ ముస్లిం కూడా సీఏఏని స్వాగతించాలని అన్నారు.
Also Read
- PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
- Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
Read Also: Yemmiganur: పద్మ శ్రీ మాచాని సోమప్ప ఆశయాలు డా. మాచాని సోమనాథ్ తోనే సాధ్యం..
గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. సీఏఏ ఏ పౌరుడి పౌరసత్వాన్ని తీసేసేందుకు కాదని, మనదేశంలో మైనారిటీలు, ప్రత్యేకించి ముస్లిం సమాజాన్ని రెచ్చగొడుతున్నారని, సీఏఏ అనేది బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల్లో హింసించబడిన శరణార్థులకు పౌరసత్వం అందించడం కోసమే అని అన్నారు. డిసెంబర్ 2019లో పార్లమెంట్ సీఏఏని ఆమోదించిన తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. అదే సమయంలో కోవిడ్ మహమ్మారి రావడంతో నిరసన సద్దుమణిగింది.
లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ ఈ బిల్లును నోటిఫై చేసింది. ఈ బిల్లు ద్వారా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉండీ, మత వివక్ష ఎదుర్కొంటున్న ముస్లిమేతర అంటే హిందూ, క్రిస్టియన్, బౌద్ధ, పార్సీ, జైన మతస్తులకు సంబంధించిన శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. డిసెంబర్ 31, 2014కి ముందు భారత్ వచ్చిన వారు మాత్రమే పౌరసత్వానికి అర్హులు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!