UAE: కోట్లలో విరాళం ఇచ్చి 900 మంది ఖైదీలను విడిపించిన భారతీయ వ్యాపారవేత్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UAE: యూఏఈలో శిక్ష పొందుతున్న భారతీయ ఖైదీలను విడిపించేందుకు భారతీయ వ్యాపారవేత్త ఆ దేశానికి భారీ విరాళాలను అందించారు. 62 ఏళ్ల ఫిరోజ్ మర్చంట్, ప్యూర్ గోల్డ్ జువెల్లర్స్ యజమాని తన ‘ ది ఫర్గాటెన్ సొసైటీ’ సాయంతో 20,000 మంది ఖైడీలకు సాయం చేశారు. 2024లో ప్రారంభంలో గల్ఫ్ దేశంలోని పలు జైళ్లలో ఉన్న 900 మంది ఖైదీలను విడిపించేందుకు ఏకంగా 1 మిలియన్ దిర్హామ్స్(సుమారు రూ. 2.5 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఈ ఏడాది 3,000 మంది ఖైదీలను విడిపించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Also: Heart attack: గుండెపోటుతో భర్త, ఏడో అంతస్తు నుంచి దూకి భార్య.. 24 గంటల్లో రెండు మరణాలు..
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
ఫిరోజ్ మర్చంట్ యూఏఈ అధికారులకు రూ. 2.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. దుబాయ్ వేదికగా ఆయన గోల్డ్ బిజినెస్ చేస్తున్నారు. రంజాన్ సంరద్భంగా క్షమాపణ, దయతో ఈ సాయం చేస్తున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. విడుదలవుతున్న 900 మంది ఖైదీల్లో అజ్మాన్ నుండి 495 మంది ఖైదీలు, ఫుజైరా నుండి 170 మంది ఖైదీలు, దుబాయ్ నుండి 121 మంది ఖైదీలు, ఉమ్ అల్ క్వైన్ నుండి 69 మంది ఖైదీలు, రస్ అల్ ఖైమా నుండి 28 మంది ఖైదీలు ఉన్నారు. గూఢచర్యం, అక్రమ వలసలు, ఇతర కేసుల్లో చిక్కుకున్న భారతీయ ఖైదీలు 900 మందిని రంజాన్ మాసంలో వారి కుటుంబ సభ్యులతో కలపాలని ఫిరోజ్ మర్చంట్ ఈ సాయం చేస్తున్నారు. ఖైదీలకు విధించిన జరిమానాలను అతను తీర్చేసి, వారందరూ జైళ్ల నుంచి విడుదలయ్యేలా చూస్తున్నారు.
ఖైదీల అప్పులను తీర్చడంతో పాటు వారు స్వదేశానికి వెళ్లేందుకు విమాన ఛార్జీలను కూడా ఫిరోజ్ మర్చంట్ అందించారు. 2024లో మొత్తం 3000 మంది ఖైదీలను విడుదల చేయాలని అతను లక్ష్యంగా పెట్టుకున్నారు. యూఏఈ అంతటా డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్తో కలిసి ఫిరోజ్ మర్చంట్ 20,000 మంది ఖైదీలకు సాయం చేశారు. ప్రభుత్వం అధికారులతో పాటు ఖైదీల ప్రశంసలను పొందారు. ఫర్గాటెన్ సొసైటీ ఛారిటీ ద్వారా ఆయన ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!