UAE: కోట్లలో విరాళం ఇచ్చి 900 మంది ఖైదీలను విడిపించిన భారతీయ వ్యాపారవేత్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UAE: యూఏఈలో శిక్ష పొందుతున్న భారతీయ ఖైదీలను విడిపించేందుకు భారతీయ వ్యాపారవేత్త ఆ దేశానికి భారీ విరాళాలను అందించారు. 62 ఏళ్ల ఫిరోజ్ మర్చంట్, ప్యూర్ గోల్డ్ జువెల్లర్స్ యజమాని తన ‘ ది ఫర్గాటెన్ సొసైటీ’ సాయంతో 20,000 మంది ఖైడీలకు సాయం చేశారు. 2024లో ప్రారంభంలో గల్ఫ్ దేశంలోని పలు జైళ్లలో ఉన్న 900 మంది ఖైదీలను విడిపించేందుకు ఏకంగా 1 మిలియన్ దిర్హామ్స్(సుమారు రూ. 2.5 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఈ ఏడాది 3,000 మంది ఖైదీలను విడిపించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Also: Heart attack: గుండెపోటుతో భర్త, ఏడో అంతస్తు నుంచి దూకి భార్య.. 24 గంటల్లో రెండు మరణాలు..
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఫిరోజ్ మర్చంట్ యూఏఈ అధికారులకు రూ. 2.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. దుబాయ్ వేదికగా ఆయన గోల్డ్ బిజినెస్ చేస్తున్నారు. రంజాన్ సంరద్భంగా క్షమాపణ, దయతో ఈ సాయం చేస్తున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. విడుదలవుతున్న 900 మంది ఖైదీల్లో అజ్మాన్ నుండి 495 మంది ఖైదీలు, ఫుజైరా నుండి 170 మంది ఖైదీలు, దుబాయ్ నుండి 121 మంది ఖైదీలు, ఉమ్ అల్ క్వైన్ నుండి 69 మంది ఖైదీలు, రస్ అల్ ఖైమా నుండి 28 మంది ఖైదీలు ఉన్నారు. గూఢచర్యం, అక్రమ వలసలు, ఇతర కేసుల్లో చిక్కుకున్న భారతీయ ఖైదీలు 900 మందిని రంజాన్ మాసంలో వారి కుటుంబ సభ్యులతో కలపాలని ఫిరోజ్ మర్చంట్ ఈ సాయం చేస్తున్నారు. ఖైదీలకు విధించిన జరిమానాలను అతను తీర్చేసి, వారందరూ జైళ్ల నుంచి విడుదలయ్యేలా చూస్తున్నారు.
ఖైదీల అప్పులను తీర్చడంతో పాటు వారు స్వదేశానికి వెళ్లేందుకు విమాన ఛార్జీలను కూడా ఫిరోజ్ మర్చంట్ అందించారు. 2024లో మొత్తం 3000 మంది ఖైదీలను విడుదల చేయాలని అతను లక్ష్యంగా పెట్టుకున్నారు. యూఏఈ అంతటా డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్తో కలిసి ఫిరోజ్ మర్చంట్ 20,000 మంది ఖైదీలకు సాయం చేశారు. ప్రభుత్వం అధికారులతో పాటు ఖైదీల ప్రశంసలను పొందారు. ఫర్గాటెన్ సొసైటీ ఛారిటీ ద్వారా ఆయన ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
తాజావార్తలు
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!