Maldives: దౌత్య వివాదాలు ఉన్నా.. మాల్దీవులకు అవసరమైన వస్తువుల ఎగుమతి చేస్తున్న భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: మాల్దీవుల అధ్యక్షుడిగా మహ్మద్ ముయిజ్జూ గెలుపొందిన తర్వాత భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారు. మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యాన్ని దేశం వదిలి వెళ్లాలని ఆదేశించడమే కాకుండా, చైనాతో సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఇండియాను కాదని చైనాతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ముయిజ్జూ ప్రభుత్వంలోని మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముయిజ్జూ నేరుగా భారత్ పేరు చెప్పకుండా తమను ఎవరూ బెదిరించలేరంటూ వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దౌత్యపరంగా సంబంధాలు దెబ్బతిన్నాయి.
Read Also: Israel: ఇరాన్ దాడి చేస్తుందని ఇజ్రాయిల్ అప్రమత్తం.. జీపీఎస్ నిలిపివేత, సైనికులకు సెలవులు రద్దు..
Also Read
- PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా సేవ.. దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ మహోత్సవ్’కు బీజేపీ సన్నాహాలు
- CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
- AAP: ఆప్కు బిగ్ షాక్.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్..
- Sonia Gandhi: ‘బిలాంగింగ్’ పేరుతో సోనియాగాంధీ ఆత్మకథ.. రాజీవ్గాంధీతో ప్రేమ ముచ్చట్లు
దౌత్యపరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ.. మాల్దీవులకు భారత్ అవసరమైన వస్తువులను ఎగుమతి చేస్తోంది. చక్కెర, గోధుమలు, బియ్యం, ఉల్లిపాయలతో సహా నిత్యావసర వస్తువులను పరిమితంగా ఎగుమతి చేస్తోందని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. బియ్యం, చక్కెర, ఉల్లిపాయల ఎగుమతిలో ప్రపంచంలో అగ్రగామిగా భారత్ ఉంది. అయితే, దేశీయంగా ఈ వస్తువులను ప్రజలకు అందుబాటులో ఉండేలా చేసేందుకు వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. అయితే కొన్ని దేశాల నుంచి వచ్చిన ప్రత్యేక విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం మాల్దీవులను ఈ బ్యాన్ నుంచి మినహాయించింది.
మాల్దీవులకు 124,218 మెట్రిక్ టన్నుల బియ్యం, 109,162 టన్నుల గోధుమ పిండి, 64,494 టన్నుల చక్కెర, 21,513 మెట్రిక్ టన్నుల బంగాళదుంపలు, 35,749 టన్నుల ఉల్లిపాయలు మరియు 427.5 మిలియన్ గుడ్లను ఎగుమతి చేయడానికి భారత్ అనుమతించింది. దీంతో పాటు 1 మిలియన్ టన్నుల కంకర రాయి, నది ఇసుకను ఎగుమతి చేసేందుకు కూడా అనుమతించింది.
తాజావార్తలు
-
IND vs SL: విజయం ముంగిట భారత్.. వరుణుడు కరుణిస్తాడా..?
-
Fire Accident: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. క్షణాల్లో వ్యాపించిన పొగ.. భయాందోళనలో ప్రజలు..
-
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా సేవ.. దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ మహోత్సవ్’కు బీజేపీ సన్నాహాలు
-
Devdutt Padikkal: నా అద్భుత ప్రదర్శనకు కారణం ఇదే.. పడిక్కల్ సీక్రెట్ టెక్నిక్ రివీల్..
-
Toxic Advance Booking: యష్ ‘టాక్సిక్’కు కౌంట్డౌన్.. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటి నుంచంటే?
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!