Working Age Population: భారత్కి గుడ్ న్యూస్.. 2045 నాటికి మరో 17.9 కోట్ల మంది “పనిచేసే జనాభా”..
- భారత్కి గుడ్ న్యూస్..
- 2045 నాటికి మరో 17.9 కోట్ల మంది "పనిచేసే జనాభా"..
- భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Working Age Population: భారతదేశానికి ఒక విధంగా చెప్పాలంటే ఇది గుడ్ న్యూస్. దేశంలో 2045 నాటికి కనీసం 17.9 కోట్ల మంది శ్రామిక వయసు కలిగిన జనాభా చేరుతుందని అంచనా వేయబడింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక వృద్ధికి కీలకంగా మారనుంది. మరోవైపు ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో శ్రామిక జనాభా తగ్గుతుంది. చైనాతో పాటు ఇతర దేశాలు కూడా ఇదే సమస్యని ఎదుర్కొంటున్న తరుణంలో భారత్కి సానుకూలమైన సంకేతంగా ఉండబోతోంది. ప్రస్తుతం దేశంలో దాదాపుగా 96.1 కోట్ల శ్రామిక జనాభా ఉంది. నిరుద్యోగం రేటు ఐదేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది.
Read Also: Megha Akash: ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్
Also Read
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
- Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ జెఫరీస్ మాట్లాడుతూ భారతదేశంలో పని చేసే వారి సంఖ్య (25 నుండి 64 సంవత్సరాల వయస్సు) పెరుగుతోందని మరియు మొత్తం జనాభాలో ఎక్కువ భాగం పొదుపు మరియు పెట్టుబడుల పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పారు. శ్రామిక ప్రజల్లో మహిళల సంఖ్య కూడా పెరుగుతోందని, ఇది కార్మిక శక్తి పెరుగుదల ముఖ్యమైన కారణమని నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే దేశంలో శ్రామిక ప్రజల సంఖ్య పెరుగుదల మందగమనం 2030 నుంచి ప్రారంభమవుతుందని జెఫరీస్ తెలిపింది. 2030 నాటికి లేబర్ ఫోర్స్ నుంచి అదనంగా 6 మిలియన్ల మంది తగ్గుతారని చెప్పింది. వ్యవసాయ ఉద్యోగాల నుంచి మారడం ద్వారా ఈ ఖాళీని భర్తీ చేయాలని సూచించింది.
ఆగస్ట్లో గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (LFPR) 2024 ఏప్రిల్-జూన్లో 50.1 శాతానికి పెరిగింది, ఇది ఏప్రిల్-జూన్ 2023లో 48.8 శాతంగా ఉంది. దేశంలో ఉపాధి పెరగడం ద్వారా ఇది సాధ్యమైంది. 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళల్లో LFPR రేటు ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి జూన్ వరకు 25.2 శాతానికి పెరిగింది, ఇది 2023 అదే కాలంలో 23.2 శాతంగా ఉంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం గత పదేళ్లలో దేశంలో దాదాపు 17 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2023-24లో దేశంలో 64.33 కోట్ల మందికి ఉపాధి లభించింది. 2014-15లో ఈ సంఖ్య 47.15 కోట్లుగా ఉంది.
తాజావార్తలు
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
-
Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!