Working Age Population: భారత్కి గుడ్ న్యూస్.. 2045 నాటికి మరో 17.9 కోట్ల మంది “పనిచేసే జనాభా”..
- భారత్కి గుడ్ న్యూస్..
- 2045 నాటికి మరో 17.9 కోట్ల మంది "పనిచేసే జనాభా"..
- భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Working Age Population: భారతదేశానికి ఒక విధంగా చెప్పాలంటే ఇది గుడ్ న్యూస్. దేశంలో 2045 నాటికి కనీసం 17.9 కోట్ల మంది శ్రామిక వయసు కలిగిన జనాభా చేరుతుందని అంచనా వేయబడింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక వృద్ధికి కీలకంగా మారనుంది. మరోవైపు ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో శ్రామిక జనాభా తగ్గుతుంది. చైనాతో పాటు ఇతర దేశాలు కూడా ఇదే సమస్యని ఎదుర్కొంటున్న తరుణంలో భారత్కి సానుకూలమైన సంకేతంగా ఉండబోతోంది. ప్రస్తుతం దేశంలో దాదాపుగా 96.1 కోట్ల శ్రామిక జనాభా ఉంది. నిరుద్యోగం రేటు ఐదేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది.
Read Also: Megha Akash: ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ జెఫరీస్ మాట్లాడుతూ భారతదేశంలో పని చేసే వారి సంఖ్య (25 నుండి 64 సంవత్సరాల వయస్సు) పెరుగుతోందని మరియు మొత్తం జనాభాలో ఎక్కువ భాగం పొదుపు మరియు పెట్టుబడుల పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పారు. శ్రామిక ప్రజల్లో మహిళల సంఖ్య కూడా పెరుగుతోందని, ఇది కార్మిక శక్తి పెరుగుదల ముఖ్యమైన కారణమని నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే దేశంలో శ్రామిక ప్రజల సంఖ్య పెరుగుదల మందగమనం 2030 నుంచి ప్రారంభమవుతుందని జెఫరీస్ తెలిపింది. 2030 నాటికి లేబర్ ఫోర్స్ నుంచి అదనంగా 6 మిలియన్ల మంది తగ్గుతారని చెప్పింది. వ్యవసాయ ఉద్యోగాల నుంచి మారడం ద్వారా ఈ ఖాళీని భర్తీ చేయాలని సూచించింది.
ఆగస్ట్లో గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (LFPR) 2024 ఏప్రిల్-జూన్లో 50.1 శాతానికి పెరిగింది, ఇది ఏప్రిల్-జూన్ 2023లో 48.8 శాతంగా ఉంది. దేశంలో ఉపాధి పెరగడం ద్వారా ఇది సాధ్యమైంది. 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళల్లో LFPR రేటు ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి జూన్ వరకు 25.2 శాతానికి పెరిగింది, ఇది 2023 అదే కాలంలో 23.2 శాతంగా ఉంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం గత పదేళ్లలో దేశంలో దాదాపు 17 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2023-24లో దేశంలో 64.33 కోట్ల మందికి ఉపాధి లభించింది. 2014-15లో ఈ సంఖ్య 47.15 కోట్లుగా ఉంది.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!