పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. 48 గంటల్లో ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అయితే మానవతా దృక్పథంతో వైద్య, దౌత్య మరియు దీర్ఘకాలిక వర్గాలకు కొంత మినహాయించింది. తాజాగా వారికి కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Trump: పహల్గామ్పై స్పందించిన ట్రంప్.. కీలక వ్యాఖ్యలు
ఈనెల 29(మంగళవారం) వరకు మాత్రమే అన్ని రకాల వీసా చెల్లుబాటు అవుతోందని.. అనంతరం వీసా పని చేయదని.. తక్షణమే అన్ని రకాల వీసాలు రద్దు చేయబడిన కారణాన పాకిస్థానీయులు వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. 29 తర్వాత వీసాలు పని చేయవని ఢిల్లీ ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఉద్రిక్తతలు మరింత తీవ్రం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక పాకిస్థానీయులకు కొత్త వీసాలు జారీ చేయబడవని.. దయచేసి అధికారిక నోటిఫికేషన్ చదవాలని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర నిర్ణయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా రీట్వీట్ చేశారు. 29లోపు వెళ్లకపోతే అవసరమైన చర్యలు ఉంటాయని రేఖా గుప్తా హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: UK: పాక్ అధికారి కవ్వింపు.. పీక కోస్తామంటూ ప్రవాస భారతీయులకు బెదిరింపు.. వీడియో వైరల్
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధు జలాలు నిలిపివేసింది. అనంతరం వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ-వాఘా సరిహద్దు మూసివేసింది. ఇలా ఒక్కొక్కటిగా కఠిన నిర్ణయాల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇక సరిహద్దుల్లో ఉగ్రవాదలు ఏరివేతను భారత సైన్యం చేపట్టింది.
Government of India has revoked all visas for Pakistani nationals, except Medical, Diplomatic & Long-Term visas, effective April 27, 2025. Medical visas will remain valid only till April 29. No new visas to be issued. Please read notification for further information. pic.twitter.com/k9lXhlO7oD
— Delhi Government (@DelhiGovDigital) April 25, 2025
The Ministry of Home Affairs, Govt of India, has revoked all Visas issued to Pakistani Nationals, except Medical, Diplomatic & Long-Term visas, with effect from 27th of April, 2025.
The existing medical visas shall also stand invalid after 29th of April, 2025. No new visas will… https://t.co/XhND4LzP0L
— Rekha Gupta (@gupta_rekha) April 25, 2025