India Slams China: ‘‘ముందు వాస్తవాలు తెలుసుకో’’.. చైనా మీడియాకు భారత్ చురకలు..
- ‘‘ముందు వాస్తవాలను నిర్ధారించుకో’’..
- చైనా మీడియాపై భారత్ ఆగ్రహం..
- ఆపరేషన్ సిందూర్పై అబద్ధపు కథనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Slams China: పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ క్షిపణి దాడుల నేపథ్యంలో, చైనా స్టేట్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఈ రోజు తెల్లవారుజామున ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో ఉగ్రస్థావరాలపై దాడులు నిర్వహించింది. పీఓకేతో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర కేంద్రాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్కి చెందిన 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు.
Read Also: Rajnath Singh: “వారే మా టార్గెట్” రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
అయితే, పాకిస్తాన్ తో పాటు దాని మిత్రదేశం చైనా అబద్ధపు వార్తల్ని ప్రచారంలోకి తెస్తోంది. చైనా స్టేట్ మీడియా గ్లోబల్ టైమ్స్ తప్పుడు కథనాన్ని వ్యాప్తి చేస్తుందని భారత్ తీవ్రంగా విమర్శించింది. కూలిపోయిన పాత విమాన చిత్రాలను ఉపయోగించి గ్లోబల్ టైమ్స్ ఒక నివేదికను ప్రచురించింది. పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్ భారత ఫైటర్ జెట్ని కూల్చేసిందని తప్పుడు ప్రచారం చేసింది.
దీనిపై భారత్ చైనాకు చురకలు అంటించింది. ‘‘ప్రియమైన గ్లోబల్ టైమ్స్, ఈ రకమైన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే ముందు మీరు వాస్తవాలను ధృవీకరించాలని, మీ మూలాలను క్రాస్ ఎగ్జామినేట్ చేయాలని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము’’ అని చైనా లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ పోస్టులో తెలిపింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తానీ అనుకూల హ్యాండిల్స్ ప్రజల్ని తప్పుదోవ పట్టించే అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నాయి.
(1/n) Dear @globaltimesnews , we would recommend you verify your facts and cross-examine your sources before pushing out this kind of dis-information. https://t.co/xMvN6hmrhe
— India in China (@EOIBeijing) May 7, 2025
తాజావార్తలు
-
OTR: రాఖీతో పొలిటికల్ బంధం బలపడుతుందా..
-
TGIIC : రాయదుర్గం భూములకు జాక్పాట్.. రూ.2,833 కోట్ల రాబడి
-
Ram Mohan Naidu: ‘పీ4’ విధానంలో శ్రీకాకుళం జిల్లాకు ‘ఎ’ గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
-
Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
-
Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!